ఫీల్ అయ్యేలా ఉండాలి.. తినే ఆహారం
జూనియర్ అంబానీ 108 కిలోల బరువు తగ్గేలా చేసిన వ్యక్తి. ఆమె షుగరు వ్యాధి గ్రస్తులకు చెప్పే ఆహార సూత్రాలు.. ఇందులోని కొన్ని అందరకి వర్తిస్తాయి.
.
1. మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి
అరటిపళ్ళు , ద్రాక్ష , సపోటా , మామిడి , ఏదైనా సరే.. !
పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది . మామిడి తినడం ఆపిల్ తినడం కంటే హానికరం కాదు . ఎందుకూ అంటే మామిడి మీకు లోకల్ , ఆపిల్ మీకు లోకల్ కాదు , ( ఆపిల్ కాశ్మీరు నుండి వస్తుంది, మామిడి మీకు లోకల్ గా దొరుకుతుంది)
ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినండి
2 . మీరు గింజల నుండి వచ్చిన నూనెలను వాడండి
( వేరుశనగ నూనె , నువ్వులనూనె , కొబ్బరినూనె , ఆవనూనె ) పేకింగ్ లో వచ్చే వెజిటల్ నూనేలకన్నా ( ఆలివ్, రైస్ బ్రాన్ , రిఫైన్డ్ ఆయిల్స్ ) మీరు ఆడించుకున్న ఆయిల్స్ మంచివి .
3. రుజిత ఎక్కువగా నెయ్యి గురించి చెబుతారు . ప్రతిరోజూ నెయ్యి ఎక్కువగా తినండి అంటారు ఆమె . ఏ ఆహారపదార్ధం లో నెయ్యి ఎక్కువగా తినవచ్చో దానిలో ఎక్కువగానూ దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగానూ తినమంటారు ఆమె .
నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది .
4. మీ ఆహారం లో కొబ్బరి ఎక్కవగా వాడండి . అటుకుల పులిహార ( పోహా ) లో ఇడ్లీ , దోశల చట్నీ , అన్నం లో చట్నీ గా తినమని చెప్తారు.
కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు . మీ నడుము సన్నబదడేలా చేస్తుంది కొబ్బరి న్తారు ఆమె
5. మీరు ఓట్స్ గానీ, ధాన్యాలు గానీ టిఫిన్ గా తినవద్దు
.
అంటారు ఆమె . అవి పేకేజ్డ్ ఆహారం . అవి మనకు అవుసరం లేదు . వాటికి రుచీ పచీ ఉండదు , బోరు కొడుతూ ఉంటాయి , మనం మొదటి ఆహారం బోరు కొట్టకూడదు అంటారు రుజిత
.
బ్రేక్ఫాస్ట్ గా పోహా , ఉప్మా , ఇడ్లీ , దోశ , పరోటా తినమని ఆమె సలహా !
6. ఫర్హానాన్ అఖ్తర్ బిస్కట్ యాడ్ లో కొరికిన ప్రతి ముక్కలోనూ పీచు ఉంది అంటారు . మన ఇంటి పెంటలో కూడా పీచు ఉంటుంది . పీచుకోసం ఓట్స్ తినక్కరలేదు .
ఓట్స్ బదులు పోహా , ఉప్మా , ఇడ్లీ , దోశ ,
7. మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం జ్యూసులు త్రాగకండి . మీకు పళ్ళు ఉన్నది కూరలూ పళ్ళూ తినడానికే !
8. చెరుకు రసం మిమ్మల్ని డీ టాక్సిఫై చేస్తుంది . అది ఫ్రెష్ జ్యూస్ రూపం లో తాగినా చెరుకు ముక్కలు తిన్నా సరే !
9. పీకాస్ , థైరాయిడ్ - ఉన్నవారు శక్తి కారకాలూ , బరువు తగ్గేవీ అయిన వ్యాయామాలు చెయ్యండి
పేకేజీ ఆహారం వదిలిపెట్టండి
10. రైస్ - మామూలు తెల్లని అన్నం తినండి . బ్రౌన్ రైస్ తినవలసిన అవుసరం లేదు . అది ఉడికేటపుడు మీ కుక్కర్ కీ , ఉడికాక మీ పొట్ట కీ శ్రమను కలిగిస్తుంది . ఎందుకు ఆ శ్రమ ?
రైస్ యొక్క జి ఇండెక్స్ చాలా తక్కువ . అది పప్పు , పులుసు , పెరుగు వంటి వాటితో కలిస్తే దాని జి ఇండెక్స్ మరింత్ తగ్గుతుంది
వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది .
B. రైస్ లో మినరేల్స్ ఉన్నాయి . కాబట్టి మీరు రోజుకు మూడుసార్లు కూడా తినవచ్చు .
11. ఎంత తినాలి ?
ఆకలిగా ఉంటె ఎక్కువ తినండి . మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్ని బట్టి చెయ్యండి
12. మీరు రైస్ , చపాతీ రెండూ తినవచ్చు , లేదా ఒక్క రైస్ మాత్రమె తినవచ్చు . మూడుపూట్లా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి . మీ ఆకలిని బట్టి తినండి
13. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు .
( నెయ్యి , రైస్ తినకూడదు అంటూ భయం వద్దు )
మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి
14. అయ్యబాబోయ్ ఎన్ని కేలరీలు తిన్నానో అని భయపడకండి , ఎంత పోషకాహారం తీసుకున్నానో అనేది చూడండి
15. పిజ్జా , పాస్తా , బ్రెడ్ , బిస్కట్ , కేకులు అస్సలు తినవద్దు
16. మిమ్మల్ని మీరు ప్రశ్నిచుకోండి
ఈ ఫుడ్ మా అమ్మమ్మ తినేదా ? మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి
17. రుతువును బట్టి తినండి .
.
వర్షాకాలం లో పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి . ఎందుకంటే ఆకలి రుతువును బట్టి ఉంటుంది . ఒక్కొక్క సీజన లో వేపుళ్ళు తినాలి . తినండి
18. ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారం గా తీసుకోకండి .
అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి . రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకుని టీ త్రాగండి
.
19. గ్రీన్ టీ త్రాగకండి . ఎల్లో టీ , గులాబీ టీ , నీలం టీ ఏమీ వద్దు .
20. మీ సాంప్రదాయ ఆహారం తీసుకోండి
21. నిలవచేసిన పేకేజీ ఫుడ్ / డ్రింక్స్ ఏమీ వద్దు
22. వ్యాయామం చెయ్యండి . వాకింగ్ చెయ్యండి . అరగడానికీ , ఆరోగ్యంగా ఉండడానికీ