ఎన్నో జన్మల పుణ్యఫలం మానవ జన్మ అని అంటుంటారు. మరి అలాంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికీ హాని తలపెట్టకపోవటం, సహాయ కార్యక్రమాలు చేయడం, పదిమందిలో గౌరవం పొందేలా జీవించడం, మన మీద ఆధారపడే వారికి ఆసరా ఇవ్వడం అలాగే ఆఖరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం ఇవన్నీ సక్రమంగా చేసేవారి జన్మ నిజంగానే సార్థకం. ప్రధానంగా ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాథమిక అవసరం. ఆకలికి ఆహారం ఎంత అవసరమో... దాహానికి నీరు ఎంత అవసరమో... అలాగే శరీరానికి నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర సరిగా లేకపోతే పలురకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇటీవల పలు అధ్యయనాలలో... సరిగ్గా నిద్రపోనివారికి ఆయువు తగ్గిపోతుందని వాటి సారాంశం... రోజుకు మనిషి కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. వయోవృద్ధులు, పిల్లలైతే రోజుకు తప్పనిసరిగా 10 గంటలు నిద్రపోవాల్సిందే. కనీసం 6 గంటలైనా నిద్ర లేకపోతే... మనం చేతులారా అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే.
నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు:- # శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే 'డిప్రెషన్'కు గురువుతారు. ఈ డిప్రెషన్ ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది.
# రోజుకు 6 గంటల
{{RelevantDataTitle}}