శీతాకాలంలో పసుపు టీ తాగితే కలిగే బెనిఫిట్స్ తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. పసుపు మన భారతదేశపు చక్కని ఔషధ సంపద. పసుపుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేల ఏళ్ళ నుంచి భారతీయులు పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పసుపులో ఉండే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక  శీతాకాలంలో పసుపు టీ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి.  


ఈ చలి కాలంలో పసుపు టీ తాగడం వల్ల చాలా  ప్రయోజనాలున్నాయి. పసుపు టీ బరువు తగ్గించడమే కాకుండా గుండెను ఆరోగ్యం ఉంచుతుంది కూడా. అంతేకాదు.. పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. పసుపులోని కుర్కమిన్ ట్యూమర్ల పెరుగుదలను అరికడుతుంది. క్యాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటుందని పరిశోధనలో వెల్లడైంది.  పసుపు టీ తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు, ఒబేసిటీతో పోరాడేందుకు కూడా సహకరిస్తుంది.డయాబెటిస్‌ను అడ్డుకోవడంలోనూ పసుపు టీ సహాయ పడుతుందని తేలింది. పసుపు టీలోని యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు ఆర్థరైటీస్ బారిన పడకుండా కాపడతాయి. కాబట్టి రోజు పసుపు టీ ని అలవాటు చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: