నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది నడుము నొప్పితో ఎన్నో బాధలు పడతారు. ఉపశమనానికి ఎన్ని మందులు వాడినా కాని ఆ సమయానికి నొప్పి తగ్గిపోతుంది కాని మళ్ళీ మళ్ళీ వాళ్లకి నడుము నొప్పి  వస్తోనే ఉంటుంది.ముఖ్యంగా ఈ కరోనా టైంలో అయితే ఇంకా దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఆఫీస్ లకి వెళ్లలేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఆ క్రమంలో వర్క్ ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ కూర్చొని కూర్చొని నడుము నొప్పి వస్తుంది. ఇక నడుము నొప్పి తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి...వెన్నునొప్పితో బాధ పడేవారు మసాజ్ ద్వారా ప్రయోజనాల్ని పొందుతారు. సున్నితంగా వీపు, నడుము భాగంలో మర్దన చేయించుకుంటే మీ నరాలు ఉత్తేజితమవుతాయి. అదే సమయంలో వీపు నొప్పి క్రమ క్రమంగా తగ్గుతుందట.

చాలా మంది సరిగ్గా నిద్ర పోరు.తక్కువ గంటలు నిద్రించడం వల్ల వెన్నునొప్పి లాంటి వాటిన పడే అవకాశాలు ఉన్నాయి. రోజుకు దాదాపు ఏడున్నర గంటల నుంచి 8 గంటల వరకు నిద్రిస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.పని చేసేటప్పుడు సరిగ్గా కూర్చోవాలి. లేకపోతే నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీరు మంచం మీద కూర్చుని పనిచేయడం మానేయండి. మీ వీపు గోడకు అనుకుని ఉండేలా చూసుకుని కూర్చుని పనిచేస్తే వెన్ను సమస్య తగ్గుతుంది. ఏ ఆధారం లేకుండా కూర్చుంటే మరిన్ని సమస్యలు వస్తాయి.పని మధ్యలో కాసేపు విరామం తీసుకుని మళ్లీ ప్రారంభించాలి. దీని వల్ల మీకు విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మధ్యమధ్యలో లేచి కొంచెం సేపు నడవాలి. నిటారుగా నిల్చుని ఉండే ఆసనాలు వెయ్యడం వలన నడుము నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది.వెన్నునొప్పి, నడుము నొప్పి ఉన్న చోట ఓ గుడ్డలో చుట్టిన ఐస్ ముక్కలతో కాసేపు తుడవాలి. వీలైతే మర్దన చేయడంతో ప్రయోజనం పొందవచ్చు. దీని ద్వారా కాస్త నొప్పి, బాధను తగ్గిస్తుంది. ఐస్ ప్యాక్‌తో తుడవటం ద్వారా కండరాల నొప్పి నుండి ఉపశమనం ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: