కరోనా కట్టడికి ఏపీ సర్కార్ కొత్త గైడ్ లైన్స్..!
అంతే కాకుండా దుకాణ సముదాయాలు, పరిశ్రమలలో నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దుకాణాలు మాల్స్ లో ప్రవేశించేతప్పుడు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించింది . డైనింగ్ హాళ్లలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా సానిటైజేషన్ చేయాలని తెలిపింది. అంతే కాకుండా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోకునేలా చూడాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఇక తాజాగా రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 31,165 మందికి కరోనా టెస్టులు చేయగా 218 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈరోజు 117 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 1795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,92,740 కేసులు నమోదయ్యాయి. ఇక వారిలో 8,83,759 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.