తెల్ల బియ్యం తినడం మానేస్తే... ఒంట్లో జరిగే అద్భుతమైన మార్పులు...

kalpana
 మనము అందరము ఎక్కువగా తెల్ల బియ్యాన్ని  వాడుతున్నాము. కొన్ని ప్రాంతాల్లో ఈ బియ్యాన్ని రోజుకు ఒకసారి తింటారు. కొన్ని చోట్ల మూడు పూటలా తెల్ల బియ్యాన్ని తింటుంటారు. బియ్యాన్ని ఎక్కువ పాలిష్ పెట్టడం వల్ల అందులో ఉండే న్యూట్రియన్స్ తగ్గిపోతాయి. బియ్యం తినడం వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే తెల్ల బియ్యాన్ని తినడం మానేస్తే మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటో? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ  సక్రమంగా జరగదు. కానీ మనకు కరెక్టుగానే జరుగుతుంది కదా అనుకుంటాం. ఇంతకన్నా  బాగా మెరుగు పడాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

 కార్బోహైడ్రేట్స్ బియ్యం లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బియ్యం తినడం మానేస్తే ఆటోమేటిక్ గా బరువు తగ్గడం మొదలుపెడతారు. అవసరానికి మించి ఆకలి వేయదు. అవసరమైనంత మాత్రమే తింటారు.
బియ్యం తినడం వలన మీ ఒంట్లో స్టార్చ్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది.



 బియ్యం తినడం వల్ల ఒంట్లో స్టార్చ్ కంటెంట్  తగ్గుతూ ఉంటుంది. ఈ స్టార్చ్ వల్ల  ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. బియ్యం తినడం మానేసిన తర్వాత మెల్లమెల్లగా సుగర్ లెవెల్స్ నార్మల్ లోకి వస్తాయి.

 తెల్ల బియ్యం తినడం మానేసి న్యూట్రీషియన్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి దీనివల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అంతేకాకుండా న్యూట్రింట్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీర భాగాలు బాగా మెరుగ్గా పనిచేస్తాయి. ఇలా చేయడం వల్ల త్వరగా అలసి పోకుండా ఉంటారు. చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు.

తెల్ల బియ్యం తినడం మానేయడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, పొట్ట, లివర్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువ కదా.కాబట్టి బియ్యం తిందాం మానేస్తే ఆటోమేటిక్ గా బరువు తగ్గడం మొదలుపెడతారు.మీకు అవసరానికి మించిన ఆకలి వేయదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: