తలనొప్పి, చిరాకు, అలసటగా ఉంటుందా? అయితే ఇవి తినండి..

Purushottham Vinay
తరచూ తలనొప్పి, చిరాకు, అలసటతో బాధపడే వారు సిట్రస్‌ పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి.వీటిని తింటం వల్ల రక్త హీనత సమస్య కూడా తగ్గిపోతుంది.నారింజ పండ్లు ఇంకా బీన్స్‌ వంటి వాటిని రోజు మనం తినే ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్‌ సి ఉండే ఆహార పదార్థాలను రోజు తినటం వల్ల మన శరీరంలో ఐరన్‌ అనేది బాగా వృద్ధి చెందుతుంది.అలాగే ఆకుపచ్చని కూరగాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల తల నొప్పి, చిరాకు ఇంకా అలసట తగ్గి అలాగే రక్త హీనత సమస్య నుంచి చాలా ఈజీగా మనం బయటపడొచ్చు. వీటిలో ఉండే ఐరన్‌ శరీరానికి ఎంతగానో మేలుని చేస్తుంది.అలాగే అవిసె గింజలు, గుమ్మడి కాయ విత్తనాలు, జీడిపప్పు, పిస్తాలు ఇంకా తృణ ధాన్యాలను ఎప్పుడు తింటూ ఉండాలి.ఇవి తినడం వల్ల తలనొప్పి, చిరాకు, అలసట సమస్యలనేవి తగ్గిపోతాయి. అలాగే రక్త హీనత సమస్యకు చాలా ఈజీగా చెక్‌ పెట్టొచ్చు.

ఇక సముద్రపు చేపలు, పీతలు ఇంకా రొయ్యల వల్ల కూడా మంచి ఐరన్‌ లభిస్తుంది.ఫలితంగా ఇలాంటి సమస్యలు ఏవి మన దరి చేరవు.అలాగే మాంసహారం అలవాటు ఉన్నట్లయితే మటన్‌ లివర్‌ ఇంకా మటన్‌ను తీసుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్‌ను చాలా ఈజీగా పొందొచ్చు. లివర్‌లో ఐరన్‌ ఇంకా ఫోలేట్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి ఎంతో అవసరమైన ఐరన్‌ అనేది మనకు పుష్కలంగా లభిస్తుంది.ఇక బీట్‌రూట్‌ వంటి ఎరుపు రంగులో ఉండే కూరగాయలను ప్రతి రోజు తినడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.అందువల్ల రక్త హీనత సమస్య, తల నొప్పి, అలసట, చిరాకు పుట్టడం లాంటి సమస్యలు అనేవి అస్సలు దరి చేరవు. కాబట్టి ఖచ్చితంగా ఇవి మీ రోజు వారి డైట్ లో భాగం చేసుకోండి.ఎల్లప్పుడూ ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: