శరీరంలో 47 కేజీల కణితి.. డాక్టర్లు ఏం చేశారంటే?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది లో శరీరం లో కణితి లాంటి సమస్యలు వచ్చే ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చర్యలో భాగం గా వైద్యులను సంప్రదించి వాటిని తొలగించు కోవడం లాంటివి చేస్తున్నారు. అయితే కణితి ప్రమాదకరం కాక పోయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందుకే ఎంతో మంది కణితి విషయం లో జాగ్రత్తలు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం శరీరం లో కణితి పెరిగి పోతుంది అని తెలిసి నప్పటికీ నిర్లక్ష్యం గా వ్యవహరించింది.


 వైద్యులను సంప్రదించ కుండా ఇంటి పట్టునే ఉండి పోయింది. చివరికి క్రమ క్రమం గా పెరిగి పోయిన ఆ కణితి ఏకంగా 47 కిలోల వరకు అయ్యింది. దీంతో కడుపు ఊహించని రీతిలో పెద్దగా అయి పోయింది. మహిళా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. గుజరాత్లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.  56 ఏళ్ల ఓ మహిళ పొత్తి కడుపులో ట్యూమర్ ఏర్పడి క్రమ క్రమంగా పెరిగి పోయింది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఆమె శరీరం లో కణితి ఏర్పడగా నలభై ఏడు కేజీల వరకు పెరిగిపోయింది ఆ ట్యూమర్.


 ఇకపోతే ఇటీవలే ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ మహిళ వైద్యులను సంప్రదించింది. అహ్మదాబాద్కు చెందిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి ట్యూమర్ను తొలగించారు. అయితే ఆపరేషన్ చేసి 47 కేజీల కణితి తొలగించడంతో ఇక ఆ మహిళ బరువు ఒక్కసారిగా తగ్గి పోయింది. ఏకంగా 49 కేజీలకు చేరుకుంది అని వైద్యులు చెబుతున్నారు. అయితే శరీరంలో ఈ స్థాయిలో కణితి ఏర్పడటం తమను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ వైద్యులు చెబుతున్నారు. ఒక మనిషి శరీరం నుంచి నలభై ఏడు కేజీల కణితి తొలగించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: