వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా? మీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నీరు కనుక తాగితే, అది మీ రక్తపోటును ఈజీగా నియంత్రిస్తుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.కొబ్బరి నీరు కొలెస్ట్రాల్ ఇంకా అలాగే ట్రై-గ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తం గడ్డకట్టడం ఇంకా గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఇక ఇతర జ్యూస్లతో పోలిస్తే కొబ్బరిలో చక్కెర ఇంకా అలాగే కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీవక్రియ బాగా పెరుగుతుంది. చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. మీరు రోజూ 1 కప్పు కొబ్బరి నీరు తాగితే ఇక అందులో 46 కేలరీలు ఉంటాయి. ఇది ఇతర పానీయాలతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి.
ఇక రోజుకు 3 నుంచి 4 సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చు.ఇక కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం మనకు లభిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా వైరస్ రోగులు తప్పనిసరిగా కొబ్బరి నీటిని తాగాలి. అయితే కొబ్బరి నీళ్లని మాత్రం సాధారణ ఉష్ణోగ్రత వద్దే ఉండాలని గుర్తుంచుకోండి.ఇది జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.అతిసారం అంటే వాంతులు ఇంకా అలాగే విరేచనాలు కూడా కరోనా కొత్త లక్షణాలలో కనిపిస్తున్నాయి.ఇక ఇటువంటి పరిస్థితిలో, మీరు కొబ్బరి నీరు కనుక తాగితే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, పేగుల్లో మంట ఇంకా అలాగే అల్సర్ వంటి సమస్యలు కూడా ఈజీగా తొలగిపోతాయి.