రక్తహీనత తో బాధపడుతున్న వారికి.. ఇది తాగితే చాలు..!!
1). ద్రాక్ష రసం:
ద్రాక్షను ఎలాగైనా తినవచ్చు లేదంటే.. వాటిని రసంగా చేసి నల్లటి ఉప్పు వేసుకొని తాగడం వల్ల ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
2). మామిడి కాయలు తినడం:
మామిడి పండు తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తొలగిస్తాయి. ప్రతిరోజు ఒక మామిడి పండు తిని.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల.. శరీరంలో రక్తం పుష్కలంగా ఉంటుంది.
3). దుంప రసం:
బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని రక్తహీనతను తగ్గిస్తుంది. అందుచేతనే రక్తహీనత ఈ సమస్య తో బాధపడే వారు బీట్ రూట్ జ్యూస్ ను తాగడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
4). కలబంద జ్యూస్:
ఈ కలబంద జ్యూస్ వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీని వినియోగం చర్మం, జుట్టు ఊడిపోవడం, ఇతర సమస్యల నుండి ఈ జ్యూస్ బయట పడవేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవ్వడమే కాకుండా హిమోగ్లోబిన్ పెంచేలా చేస్తుంది.
వీటన్నిటిని ట్రై చేయడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు.