బద్ధకంతో ఈ రోగాలు ఖాయం? బద్ధకం పోవాలంటే..?

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో చాలా మందిని పట్టిపీడిస్తున్న సమస్య బద్ధకం. మారుతున్న లైఫ్ స్టైల్‌  కారణంగా బద్ధకం కూడా పెరుగుతోంది. బద్ధకం ఎక్కువ కావడంతో చాలామందిలో సోమరిపోతుతనం బాగా పెరుగుతోంది. సోమరిపోతుతనం పెరుగుతున్న వారిలో ప్రాణంతాక వ్యాధులు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం ఇంకా సరైన శారీరక శ్రమ లేకపోతే ప్రాణాంతక వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కనీసం వ్యాయామం చేయనివారు ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారని పలు అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి. బద్ధకంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న వారిలో యువత చాలా ఎక్కువగా ఉన్నారు. 2020 నుంచి 2030 మధ్య ఏకంగా 50 మిలియన్లకు పైగా ప్రజలు జీవనశైలి వ్యాధుల బారిన పడనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఇక వీరిలో 47 శాతం మంది హైపర్‌టెన్షన్ లేదా హై బీపీతో ఎక్కువగా బాధపడుతుండగా.. 43 శాతం మంది అయితే డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది.ఒక వ్యక్తి ప్రతిరోజూ తన సమయాన్ని ఖచ్చితంగా 21 నిమిషాలు వ్యాయామానికి కేటాయించినట్లయితే.. ఈ వ్యాధులను 20 నుంచి 30 శాతం వరకు ఈజీగా నివారించే అవకాశం ఉంది. ఇది డిప్రెషన్ ఇంకా గుండె జబ్బుల కేసులలో 7 నుంచి 8 శాతం మందిని నిరోధించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.


74 శాతం మరణాలు అనేవి జీవనశైలి వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయని,ఇక 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1 కోటి 70 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ జీవనశైలి వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు.అలాగే ప్రపంచంలోని ధనిక దేశాలలో 36 శాతం మంది సోమరిపోతుతనంతో ఉంటున్నారని ఇంకా పేద దేశాల్లో అయితే కేవలం 16 శాతం మంది మాత్రమే ఈ సోమరిపోతు తనంతో ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కూడా 42 శాతం దేశాలు మాత్రమే నడక లేదా సైక్లింగ్ కోసం విధానాలు ఇంకా సౌకర్యాలను కలిగి ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు మొత్తం 26 శాతం దేశాలు మాత్రమే కఠినమైన విధానాలను కలిగి ఉండగా.. కేవలం 26 శాతం దేశాలు మాత్రమే వేగ పరిమితి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి. ప్రజలు యోగా ఇంకా వ్యాయామం వంటివి చేస్తే రోగాల బారిన పడకుండా ఈ విధంగా తమను తాము కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: