సీజన్లను బట్టి వచ్చే కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. వాటిలో ఒకటి బేల్ పండు కూడా ఒకటి. ఈ పండు ఆరోగ్య ప్రయోజనాల గురించి అతి తక్కువ మందికి తెలుసు. ఇక దీన్నే వుడ్ యాపిల్, కోత్బేల్ అని కూడా పిలుస్తారు.మన దేశంలో అత్యంత ప్రత్యేకమైన పండు బేల్ పండు. దీన్ని ఒడియాలో కైతా అని ఇంకా హిందీలో కోత్బేల్ అని పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. భారతీయ మసాలా దినుసులు ఇంకా సుగంధ ద్రవ్యాలతో కలిపి దీన్ని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పండుని విరేచనాలు, డయేరియా వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే మలబద్ధకం సమస్య నుంచి బయట పడేందుకు ఇదొక గొప్ప ఔషధంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇందులో భేదిమందు గుణాలు ఉన్నాయి.మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మన శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపించేస్తుంది. ఇది గుండ్రంగా, మెత్తటి గుజ్జు, పీచుని కలిగి ఉంటుంది.
ఈ బేల్ పండులో లూపియోల్, యూజినాల్, లిమోనెన్, సిట్రల్, రుటిన్ ఇంకా ఆంథోసైనిన్స్ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నందు వలన ఇది కెమోప్రివెంటివ్ ఎఫెక్ట్స్ ను ప్రేరేపిస్తుంది.అలాగే ఇది పేగు జీవసంబంధమైన చర్యకు మద్దతు ఇస్తుంది. ఇంకా పేగు వ్యాధి ఐబీఎస్ లక్షణాలని తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియాలో సహాయపడుతుంది.అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంది. గాయాలు అయిన అవయవాలని నయం చేస్తుంది. ఈ పండులో అధిక ప్రోటీన్ కంటెంట్ అనేది గాయాల్ని త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇంకా ఇందులోని బీటా కెరోటిన్ కాలేయ సమస్యల్ని నయం చేస్తుంది. అలాగే దీనిలో థయామిన్, రిబోఫ్లేవిన్ ఉన్నాయి.చాకుతో బేల్ పండు తొక్కని తీసేసుకోని అందులోని గుజ్జును తీసుకుని మసాలా దినుసులు జోడించుకుని తినొచ్చు. ఈ పండు రుచి తీపి అలాగే పులుపు కలగలిపి ఉంటుంది. అందుకే పండిన పండు గుజ్జును అలాగే లేదా చక్కెరతో కలిపి తింటారు. దీన్ని రసం, జెల్లీ, చట్నీ తయారీకి ఉపయోగించుకోవచ్చు.