షుగర్ రోగులకు అన్నం తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

Purushottham Vinay
మధుమేహం సమస్యతో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఆహారం, జీవనశైలిలో  ఖచ్చితంగా ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి.రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కార్భోహైడ్రేట్ల పరిమాణాన్ని పరిశీలించుకోడం తప్పనిసరిగా చెయ్యాలి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అన్నం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. అధ్యయనాల ప్రకారం టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు అన్నం తక్కువగా తింటూ ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలను తినాలి. ప్రతి మధుమేహ రోగి రోజువారీ ఆహారంలో కార్భోహైడ్రేట్ల పరిమితిని నిర్ణయించుకోవడం మంచిది.మరీ ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తక్కువ అన్నంతో ఎక్కువ కూరను తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్, లాంగ్ గ్రెయిన్ వైట్ రైస్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ ఫైబర్, న్యూట్రియంట్లు, విటమిన్లు ఉంటాయి.ముఖ్యంగా బియ్నాన్ని ఉడికించి అన్నం అయిన తర్వాత మళ్లీ వేడి చేసుకుని తినడం చాలా మంచిది.



ఎందుకంటే ఇలా చేయడం వల్ల తక్కువ పిండి పదార్థాలను విచ్ఛినం చేయడానికి ఉపయోగపడుతుంది.షుగర్ వ్యాధిగ్రస్తులకు అన్నం వండే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మేలని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. బాస్మతి లేదా బ్రౌన్ రైస్ అనేవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా బియ్యం వండే ముందు రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి ఓ గంటపాటు వాటిని నానబెట్టాలి. ఇంకా అలాగే అన్నం ఉడుకుతున్న సమయంలో గ్యాస్ ఆఫ్ చేసి ఆ బియ్యాన్ని చల్లారనివ్వాలి. ఆ తరువాత మళ్లీ వండాలి.ఎందుకంటే ఈ ప్రక్రియ రెసిస్టెంట్ స్ట్రాచ్‌ను ఏర్పాటును పెంచుతుంది. ఇలా చేయడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి మేలు కలుగుతుంది.అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం కోసం అన్నంపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోల్డ్ అండ్ స్టీల్ కట్ వోట్స్, బార్లీ, గోధుమ, క్వినోవా, మిల్లెట్ ఇంకా బుక్‌వీట్ వంటి ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: