పసుపుతో ఈ వంటకం చేస్తే ఎన్నో లాభాలు మీ సొంతం?

Purushottham Vinay
పసుపుతో ఈ వంటకం చేస్తే ఎన్నో లాభాలు మీ సొంతం?



పసుపు వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి.మన పూర్వీకుల కాలం నుంచి ప్రతి వంటలో కూడా పసుపుని వాడుతున్నారు.ఆసుపత్రులు రాకముందు దాకా ఎవరికి దెబ్బతగిలినా కూడా పసుపుతోనే మొదటి వైద్యం చేసేవారు. ఇప్పటికే కూరగాయలు కోసేటపుడు వేలు తెగినా ఇంకా ఆడుకుంటూ పిల్లలకు దెబ్బలు తగిలినా రక్తం ఎక్కువ పోకుండా మొదటగా పసుపే చల్లి కట్టుకడతారు. ఎందుకంటే పసుపులో అంతటి యాంటీ బయోటిక్ గుణాలున్నాయి.అయితే సాధారణంగా మనం కూరగాయలతో రోటిపచ్చళ్లను ఎక్కువగా తయారు చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా పసుపు చట్నీని ట్రై చేశారా ? దీన్ని పసుపు కొమ్ములతో చేస్తారు. పసుపు ఎక్కువగా పండించే ప్రాంతంలో ఇది చాలా ఫేమస్. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



పసుపు చట్నీ తయారీకి కావలసిన పదార్థాల విషయానికి వస్తే..


పసుపు కొమ్ములు – పచ్చివి 6, వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి -2, నల్ల జీలకర్ర – అర టీస్పూన్ ఇంకా నూనె -1 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా తీసుకోవాలి.



పసుపు చట్నీ తయారీ విధానం విషయానికి వస్తే..ఈ పసుపు చట్నీని తయారు చెయ్యడం చాలా సులభం. పసుపు కొమ్ములు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, నల్లజీలకర్ర ఇంకా ఉప్పు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. వీటిలో రోటిలో దంచుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు పాన్ లో నూనెని పోసి.. ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి అందులో నీరంతా కూడా పోయేంత వరకూ కలపాలి. తరువాత అది డ్రై గా మారి చాలా గట్టిగా అవుతుంది. దీనిని వేడిగా ఉండగానే అన్నం లేదా రొట్టెలలో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.కాబట్టి పసుపు చట్నీ తినండి. ఎలాంటి రోగాలు రాకుండా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: