ఈ పిచ్చి మొక్కతో అన్ని వ్యాధులు మాయం?

Purushottham Vinay
ఈ అందమైన ప్రకృతిలో చాలా రకాల మొక్కలు పెరుగుతుంటాయి. అయితే వాటిల్లో చాలా వరకు పిచ్చి మొక్కలే ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.ఔషధ గుణాలు కలిగి ఉండే మొక్కల గురించి చాలా మందికి కూడా తెలియదు. ఇక అలాంటి వాటిల్లో రెడ్డివారి నానుబాలు మొక్క కూడా ఒకటి. ఇది మన చుట్టూ ప్రకృతిలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూనే ఉంటుంది. పొలాలు, చేల గట్ల మీద ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ మొక్క కనబడితే దాన్ని అస్సలు విడిచిపెట్టకండి. మీరు దీన్ని ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే దీంతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. రెడ్డివారి నానుబాలు మొక్కను ఉపయోగించి ఏయే వ్యాధులను ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.రెడ్డివారి నానుబాలు మొక్క ఆకులు లేదా కాండాన్ని తెంచినప్పుడు దాని నుంచి పాలు వస్తాయి. ఇవి మనకు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి.అయితే ఈ మొక్క రెండు రకాలుగా ఉంటుంది. కొన్ని చిన్న ఆకులను ఇంకా పువ్వులు లైట్‌ రెడ్‌ కలర్‌ను కలిగి ఉంటాయి.



ఇక కొన్ని మొక్కల ఆకులు అయితే పెద్దగా ఉంటాయి. వీటి కలర్‌ కూడా లేత ఎరుపుగా ఉంటుంది. ఇక ఇలా ఆకులు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఎలాంటి రెడ్డివారి నానుబాలు మొక్క అయినా కానీ మనకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మీరు దీన్ని ఎలా ఉపయోగించాలంటే..ఆస్తమా ఉన్నవారికి రెడ్డివారి నానుబాలు మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను తెంచి వాటిని శుభ్రంగా కడిగి వాటితో డికాషన్‌ తయారు చేయాలి. అయితే దీన్ని రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. అందువల్ల ఆస్తమా నుంచి రిలీఫ్‌ లభిస్తుంది.ఇంకా అలాగే దగ్గు ఉన్నవారికి కూడా ఉపశమనం లభిస్తుంది.ఇంకా దీంతోపాటు జలుబు నుంచి కూడా బయట పడవచ్చు.బ్లడ్‌ షుగర్‌ను తగ్గించడంలో కూడా మనకు రెడ్డివారి నానుబాలు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని డికాషన్‌ను తాగుతుంటే షుగర్‌ లెవల్స్‌ ఈజీగా తగ్గుతాయి. డయాబెటిస్‌ కూడా అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే ఈ ఆకులను తీసుకుంటే విరేచనాల వంటి సమస్య నుంచి బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: