ఇలా చేసి షుగర్ ని తగ్గించుకోవచ్చు?

Purushottham Vinay
రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే ఖచ్చితంగా రోజుకు 20-25 నిమిషాలు యోగా చేయాలి. ఎందుకంటే యోగా చేయడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్ ను చాలా సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక యోగాసనాలు ఆచరించే అలవాటు అనేది అనేక వ్యాధుల ప్రమాదాన్ని ఈజీగా తొలగిస్తుంది.ఇక మధుమేహం అదుపులో ఉండాలంటే ఖచ్చితంగా మెంతి గింజలను తినండి.ఎందుకంటే మెంతి గింజల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.మీరు మెంతి గింజలను నీటిలో కూడా నానబెట్టి తినవచ్చు.కావాలంటే ఈ మెంతి గింజలను మొలకలుగా కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ మెంతి గింజలు రుచిలో చేదుగా ఉంటాయి కానీ ఈ చేదు మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మంచి ఔషధంలా పనిచేస్తాయి.రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ దాల్చిన చెక్కను తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ నిరోధకతను ఈజీగా తగ్గిస్తుంది. ఒక చెంచా దాల్చిన చెక్క ఇంకా ఒక చెంచా మెంతిపొడి, కొద్దిగా పసుపు కలపండి.


ఈ పొడిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే, రోజంతా బ్లడ్ షుగర్ ఈజీగా అదుపులో ఉంటుంది.ఒక సోరకాయ, మీడియం సైజ్ దోసకాయ , మీడియం సైజు టొమాటోని తీసుకోండి. ఈ మూడు కూరగాయలను జ్యూస్‌గా చేసుకుని ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే  షుగర్ అదుపులో ఉంటుంది. ఈ మూడు కూరగాయలు చక్కెరను ఈజీగా నియంత్రిస్తాయి. ఇంకా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇంకా శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. ఈ రసం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే పొట్టను కూడా శుభ్రంగా ఉంచుతుంది.ఇంకా గిలోయ్ మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ గిలోయ్‌ని తినడానికి, గిలోయ్‌ని తీసుకొని దానిని చూర్ణం చేయండి. ఇప్పుడు ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో గిలోయ్‌ని రాత్రంతా కూడా నానబెట్టండి. ఉదయం పూట ఈ నీటిని మరిగించి, సగం నీరు మిగిలిపోయాక  గ్యాస్ ఆఫ్ చేయండి. గిలోయ్ టీ తీసుకోవడం వల్ల రోజంతా కూడా చక్కెర నియంత్రణలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: