ఇలా చేస్తే శరీరంలో చెత్త పోతుంది?

Purushottham Vinay
ఈ రోజుల్లో చెడు ఆహారం తినడం, తాగడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. దాంతో పాటు శరీరంలో కొవ్వు కూడా పేరుకుపోతుంది. ఇంకా అంతేకాకుండా, గ్యాస్-గుండె మంట సమస్య కూడా తరచుగా వేధిస్తుంది.అయితే ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం ఖచ్చితంగా చాలా ముఖ్యం. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగడం ఖచ్చితంగా చాలా అవసరం. ఇది మలబద్ధకం సమస్యను ఈజీగా దూరం చేస్తుంది.ఇంకా అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.అయితే కేవలం నీళ్లు మాత్రమే తాగితే ఈ ప్రయోజనం ఉండదు. శరీర నిర్విషీకరణ చేయడానికి నీళ్లలో కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుకోవాలి.శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడానికి పసుపు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే పసుపులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా అలాగే శరీరం నుంచి హానికారక విషాలను బయటికి పంపుతుంది.పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి శరీరాన్ని సహజమైన మార్గంలో నిర్విషీకరణ చేస్తాయి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది.


మనం తాగే పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగొచ్చు. ఎందుకంటే పసుపు పాలలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. ఇంకా అంతేకాకుండా, పసుపు-పాలు శరీరం నుంచి హానికారక విషాలను తొలగిస్తుంది. ఇక పాలు మరిగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. తాగేటప్పుడు అందులో స్పూన్‌ తేనె కలుపుకుంటే సరిపోతుంది.అలాగే పసుపు డిటాక్స్ నీళ్లను కూడా తయారు చేసి త్రాగవచ్చు. ఒక గ్లాస్‌ నీళ్లలో అల్లం, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు ఇంకా దాల్చిన చెక్కలను కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి.ఆ మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లలో పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత దానిని తాగితే శరీరంలో వ్యాధుల ప్రమాదాన్ని ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా ఇది టాక్సిన్స్‌ని కూడా తొలగిస్తుంది.అలాగే పసుపు టీ తాగడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చు. ఇక ఒక్కొక్క ముక్క చొప్పున తాజా పసుపు, అల్లం తీసుకుని 2 కప్పుల నీళ్లలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ ఈ నీటిని మరిగించి వడకట్టాలి. తరువాత అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తే అజీర్ణం, ఆర్థరైటిస్ నొప్పి ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: