నేటి కాలంలో జీవనశైలి పూర్తిగా మారింది. ముఖ్యంగా పనితీరు అనేది పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమతో కూడిన పని ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కూర్చుని పనిచేసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది.కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చొని పని చేస్తున్నారు. ఇంకా అలాగే స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా భారీగా పెరిగింది. దీనివల్ల తల కిందికి దించుకొనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమ, ఎక్కువ సేపు తల దించుకొని ఉండడం వల్ల మెడనొప్పి సమస్య చాలా ఎక్కువగా వేధిస్తోంది. ప్రతీ నలుగురిలో ఇద్దరు ఖచ్చితంగా మెడ నొప్పితో బాధపడే పరిస్థితి వచ్చింది. ఇక దీనికి ప్రధాన కారణం.. సిట్టింగ్ పొషిజన్ కూడా సరిగ్గా లేకపోవడమే. సరైన పొజిషిన్లో కూర్చోకపోతే మెడ కండరాలు బాగా బిగుసుకుపోయి మెడ నొప్పి వేధిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి కారణంగా కూడా మెడ, భుజాలు చాలా బిగుతుగా మారుతున్నాయి. అందువల్ల ఇది మెడ కండరాల నొప్పికి కారణంగా మారుతుంది.
ఇక మెడనొప్పి సమస్యతో బాధపడే వారు కండరాలు రిలీఫ్ అయ్యే వ్యాయామాలను ఖచ్చితంగా చేయాలి. నెక్ ఎక్సర్సైజ్లను చేయడం ఖచ్చితంగా ప్రతి రోజూ కూడా అలవాటుగా మార్చుకోవాలి. మెడను నాలుగు దిక్కుల తిప్పుతూ కండరాలు ఫ్రీ అయ్యేల వ్యాయాయం ఖచ్చితంగా చేయాలి. ఇంకా అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని పని చేయకూడదు.అలాగే కాసేపు పనిలో బ్రేక్ తీసుకుంటూ తలను అప్పుడప్పుడు పైకి ఎత్తుతూ ఉండాలి. ఇంకా విరామ సమయంలో మెడను నెమ్మదిగా తిప్పాలి.ఇక కంప్యూటర్ ముందు పనిచేసే సమయంలో స్క్రీన్ను కాస్త పైకి ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎప్పుడైనా తల కిందికి ఉండేలా స్క్రీన్ అస్సలు ఉండకూడదు. ఇలా స్క్రీన్ కిందికి ఉంటే.. మెడపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. అలాగే కండరాలు దృఢత్వం కోల్పోతాయి. నడిచే సమయంలో కూడా ఖచ్చితంగా సరైన పొజిషన్లో ఉండాలి.. భుజాలు ఖచ్చితంగా నిటారుగా ఉండేలా చూసుకోవాలి. పైన పేర్కొన్ని చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. మెడ నొప్పిని చాలా ఈజీగా దూరం చేసుకోండి.