మునగాకుతో మోకాళ్ళ నొప్పులకు బాయ్ చెప్పండి..!
అస్సలు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా రావడానికి కారణం అధిక అధిక బరువు,నున్నటి గచ్చులపై నడవడం,ఒకే చోట అధిక సమయం కూర్చోవడం,లేదా ఒకే సమయం ఎక్కువగా నిలబడి ఉండడం వాటితో మోకాళ్ళ సమస్యలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకుంటూ,ఆయుర్వేదంలో మునగాకుతో చేసే చిట్కా ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
దీనికోసం ముందుగా మునగాకును 100 గ్రామ్స్ తీసుకొని,బాగా శుభ్రం చేసి ఎండబెట్టుకోవాలి.ఆ తరువాత ఈ మునగాకును మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు 100 గ్రామ్స్ బెల్లం,100 గ్రామ్స్ తేనే తీసుకొని బాయిల్ చేయాలి.ఇది తీగ పాకం వచ్చిన తర్వాత మునగాకు వేసి బాగా కలియబెట్టాలి.ఇలా కలియబెట్టిన లేహ్యంగా తయారవుతుంది.ఈ లేహ్యాన్ని గాలి చొరబడిన సీసాలో బద్రపరచుకుంటే,ఒక నెలరోజుల పాటు వాడుకోవచ్చు.
ఎవరైతే మోకాళ్ళ,నొప్పులు కీళ్ల నొప్పులు,నడుము నొప్పులంటూ బాధపడుతూ ఉంటారో,అలాంటి వారు ఒక స్పూన్ మోతాదులో ఈ లేహ్యాన్ని పరగడుపున తీసుకోవాలి.ఇలా 100 రోజులపాటు చేయడం వల్ల, మోకాళ్ళ కీళ్ల మధ్యలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.మరియు బోన్స్ స్ట్రెంత్ కి కావాల్సిన కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది.
అంతేకాక ఈ లేహ్యము తరచూ తీసుకోవడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది.దీనివల్ల రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా ఉపయోగపడి,మధుమేహం కంట్రోల్లో ఉంటుంది.మరియు రోగ నిరోధక శక్తి పెరిగి, రకరకాల బ్యాక్టీరియాల్ వల్ల వచ్చే వ్యాధులు కంట్రోల్లో ఉంటాయి.మరియు ఎటువంటి గాయాలు అయినా కలిగించే ఇన్ఫ్లమెషన కూడా తగ్గుతుంది.కావున మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారు,వెంటనే పెయిన్ కిల్లర్లు బదిలు ఈ లేహ్యం వాడితే చాలు.