ఆరోగ్యానికి కావాల్సిన పోషకాహారం డ్రై ఫ్రూట్స్లో పుష్కలంగా ఉంటాయి. చూడటానికి అవి చిన్నగా ఉన్నా అందులోని ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి శక్తిని ఇస్తాయి. సహజంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించడంతో డ్రై ఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. డ్రై ఫ్రూట్స్లో మనకు బాగా తెలిసింది కిస్మిస్ (ఎండు ద్రాక్ష). కిస్మిస్ బాగా తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టొచ్చు.
ఆయుర్వేదంలో కూడా అనేక రోగాల మందులకు ఎండుద్రాక్ష వినియోగిస్తారు. మనిషికి కిస్మిస్ ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామా..
- ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాలున్న వారికి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది.
- మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరుకి ఎండుద్రాక్ష దివ్యౌషధం.
- వీటిని తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఎండుద్రాక్షలో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది.. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
- ఎండుద్రాక్ష తినడం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
- తరుచూ ఎండుద్రాక్ష తింటే రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) అదుపులో ఉంటాయి.
- ఆకలి వేసినప్పుడు స్నాక్స్ కంటే వీటిని తినడం మేలు.
- ఇవి మెదడుకీ మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి.
- ఎండుద్రాక్షలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, డయేరియాని నివారిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి సాయం చేస్తుంది.
- ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేనివాళ్లకి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగకరం.
- వీటిల్లో పొటాషియం, కెటెచిన్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి ఆర్ధరైటిస్తో బాధపడేవాళ్లకి ఎంతో మేలు. అలాగే ఇందులోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.