హైదరాబాద్ లో నెత్తుటి గాయానికి పధ్నాలుగేండ్లు
దీని వెనుక తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. అయితే నిందితులను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఎండీ సిద్దిక్ ఇస్సార్ అహ్మద్, ఎండీ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనిక్ షఫిఖ్ సయ్యద్, ఫారుఖ్ షర్ఫుద్దీన్ తార్కష్ అనే నిందితులను పట్టుకున్నారు. అనంతరం ఆక్టోపస్ విభాగం, కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పీడీ యాక్టు కింద ముంబయి పోలీసుల నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, నాంపల్లి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లలో ఐఎంకు చెందిన రియాజ్ భత్కల్, అక్బర్, అనీఖ్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రజాఖాన్, ఫారూఖ్ తర్ఖాష్, సాదిక్ షేక్ ను నిందితులు చేర్చారు. టిఫిన్ బాక్సుల్లో బాంబులను ఉంచి, వాటికి టైమర్లను అమర్చి పేలుళ్లు జరిపారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఈ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. 2018లో చివరి తీర్పు వెల్లడించింది. నిందితుల్లో అనిక్ షఫిఖ్ సయ్యద్, ఎండీ అక్బర్ ఇస్మాయిల్ చౌదరీకి ఉరిశిక్ష విధించింది. నిందితులకు ఆశ్రయం కల్పించిన మరో వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అయితే ఇద్దరు నిందితులకు విధించిన ఉరిశిక్ష ఇప్పటికీ అమలు కాలేదు.