ఉగాది పండక్కి చీరకొనటానికి సంతకెళ్ళింది వీరమ్మ . ఎర్ర చీర ఎంచుకుని బేరమాడింది. అటు తిప్పి ఇటు తిప్పి ఈ మాట ఆ మాటా చెప్పి చివరకు ఈ చీరను నలభై రూపాయలకు ఒప్పించడానికి నల్లబడ్డాడు ఎండకు చీరలవ్యాపారి చిన్నయ్య.
ఆమె ఇంటికి చేరుకునేసరకి ప్రక్కింటి అంతమ్మ అలాంటి చీరనే తీసుకొచ్చి తను ముప్పై ఐదు రూపాయలకే కొన్నట్టు చెప్పింది. వీరమ్మకు ఆమాట చెవిన పడగానే మనసులో ఒకటే కలవరింత మొదలైంది. చీర పోలికలో ఎటువంటి మార్పులేదు.
పొడవు వెడల్పులో తేడాలు లేవు దారం నేత అంతా ఒకటే రెండూ ఎరుపే, చీరలోని డిజైన్ కూడా అంతా ఒకటే ఐదు రూపాయలు నష్టపోయానని బేరమారడ్డంలో పొరపాటుపడ్డానని అనుక్షణం మధన పడసాగింది.
ఆ చీరను కట్టిన ప్రతీసారి ఆమెలో ఒకే బాధ అనవసరంగా ఐదురూపాలయిలు ఎక్కువ పెట్టి కొన్నానని మూడు నెలలు తర్వాత వీరమ్మకు మనసు తేలిక పడింది. కారణమేమిటంటే శాంతమ్మ కట్టిన చీర రంగు వెలిసిపోయింది.
మరింత సమాచారం తెలుసుకోండి: