బుడుగు: వర్షాకాలంలో పిల్లల్లో వచ్చే అనారోగ్యాలు పట్టించుకోకపోతే అంతే సంగతులు.. !!
దీని కారణంగా ఊపిరితిత్తులలోకి నిమ్ము చేరి పిల్లలకు ప్రమాదంగా మారుతుంది. ఇలా నిమ్ము చేరకుండా ఉండాలంటే తల్లి బిడ్డకు 6 నెలల వరకు పాలు ఇస్తే మంచిది.అపరిశుభ్రత, కాలుష్యంలోని పొప్పొడి రేణువుల వలన, శ్వాసనాళాలలో అడ్డుపడి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.ఇలా ఉండే పరిస్థితినే ఆస్తమా అని అంటారు. ఆస్తమా ఉన్నప్పుడు దగ్గు కూడా ఎక్కువగా ఉంటుంది.వర్షంలో పిల్లలను బయటకు తీసుకుని వెళ్లకపోవడమే మంచిది.
జలుబు,దగ్గు నుండి ఫ్లూ జ్వరాలు వెంటనే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలను చేరుతాయి. అలాగే ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, కలుషిత నీటిని సేవించడం వలన, దోమలు ఎక్కువగా ఉండటం కారణంగా వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వ్యాపిస్తాయి.అందుకనే పిల్లలకు కాచి చల్లార్చిన మంచినీళ్లు తాగించాలి. లేదంటే ఫిల్టర్ చేసిన నీరు అయినా తాగించాలి. పిల్లలకు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమలు పోయే క్రిమిసంహారక మందులను వాడాలి.అవి కూడా పిల్లలకు అందకుండా జాగ్రత్తగా భద్రపరచాలి.. ఇంటిలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలిి.