బుడుగు: పిల్లల ఈ విషయాల్లో తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలి..?
కాలానికి అనుగుణంగా ప్రజల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు పెరిగాయి. దీంతో మనుషులకు విశ్రాంతి, స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు కోరుకునే ఒకటే.. ఇద్దరు పిల్లలుంటే చాలని. అయితే ఈ ఇద్దరు పిల్లలతో కూడా టైం కేటాయించలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు ఏది అడిగినా కాదనలేరనే బలహీనతని ప్రేమ అనుకుంటున్నారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఏ రకమైన వంటకాలు కావాలంటే అది చేసి పెడుతున్నారు. అయితే అతి గారబం వల్ల కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
తల్లిదండ్రులు ఆఫీసుకు టైం అయి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు కాళ్ల దగ్గరికి వెళ్లోదంటూ గారబం చేస్తుంటారు. పిల్లలు అలా చేయడానికి పూర్తిగా తల్లిదండ్రులు చేసిన అతిగారాబమే కారణం. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేస్తూ పోతుంటే పిల్లలు చిన్నప్పటి నుంచే చెడిపోయే లక్షణం ఉంటుంది. వాళ్ల మనసులో ఏది అడిగినా మా తల్లిదండ్రులు ఇచ్చేస్తారనే ఆలోచన వారిలో నాటుకుపోతుంది. అలా అదే పెరిగి పెద్దయ్యాక అలవాటుగా మారిపోతుంది. అందుకే చిన్నప్పటి నుంచే నియంత్రించడం నేర్పించాలి. ఏం కావాలని చెప్పినా.. అత్యవసరమైతే తప్ప ప్రతిదీ కొనుగోలు చేయవద్దు. అలా చేస్తేనే చిన్నప్పటి నుంచి వారు దృఢంగా ఉంటారు.
చిన్నప్పటి నుంచే ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అలవాటు చేయించాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. మారం చేసిన ప్రతిసారి ఏదో ఒకటి కొనిపిస్తే అదే అలవాటుగా మారుతుంది. పెద్దయ్యాక విధ్వంసం సృష్టించినా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. చదువు, క్రమశిక్షణ విషయంలో తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడే పిల్లలు పెరిగి పెద్దయ్యాక ప్రయోజకులుగా మారుతారు. గారం చేసి పెంచితే భవిష్యత్లో అన్ని విషయాల్లో ఫెయిల్యూర్గా మిగిలిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి అవసరానికి మించిన స్వేచ్ఛను, హద్దులను కలిగి ఉంచాలి. అప్పుడే పిల్లల భవిష్యత్ బాగుంటుంది.