సాధువుగా మారిన దొంగ

Durga
ఒక రోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. కొన్ని కాయలు కోసాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా తెతికారు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ పట్టుబడకుండా తప్చికుకోవాలని ఒంటికి విభూతి రాసుకుని చేతలు జోడించి కళ్లు మూసుకుని ఒక చెట్టు కింద కూర్చుని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టకోలేకపోయారు. కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలా చాలా సంతోషించారు. మరుసుటి రోజు ఆ తోటలో ఒక సాధువు దిన చేశాడన్న వార్త సుడిగాలిలా ఊరిలో పాకిపోయింది. చాలామంది ప్రజలు, పండ్లు తినుబండారాలు తీసుకొని వచ్చి సాధువు కాళ్ళదగ్గర పెట్టారు. కొంతమంది అతడి పాదలవద్ద వెండి, బంగారం, డబ్బును కూడా పెట్టారు. నేను దొంగ సన్యాసిని కధా! అయినా ఇంతమంది ప్రజలు నా పట్ల భక్తి శ్రద్ధలు చూపుతున్నారు. ఎంత ఆశ్ఛర్యం అని ఆ దొంగ ఆలోచించాడు. నేను నిజంగానే సాధువుగా మారితే మరెంత గౌరవిస్తారో అని ఆలోచించి నిజమైన సాధువు కావడానికి తీర్మానించుకున్నాడు. కొంత కాలానికి ఆ దొంగ నిజంగానే సాధువుగా మారి భగవంతుని కృపను పొందాడు. ఈ కథలోని నీతి : అందరూ పవిత్రతనే గౌరవిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: