ఉప్పు వల్ల కలిగే లాభాలను మాత్రమే చూసి ఉంటారు.. కానీ ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను మాత్రం చూసి ఉండరు.. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు..ఈ విషయం పై అనేక పరిశోధనలు జరిపి ఉప్పును ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయని తేల్చి చెప్పారు.. తాజాగా ఉప్పులో సోడియం కంటెంట్కు లిమిట్ పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సంవత్సరం 11 మిలియన్ల మంది డైట్ పాటించకుండా ఇష్టానుసారంగా ఉండటం వల్లనే చనిపోతున్నారని తెలిపింది. అందులో 3 మిలియన్ల మంది సోడియం ఎక్కువ శాతం తీసుకోవడమే ప్రధాన కారణం.
ధనిక దేశాలు, పేరుగుతున్న పేదరికంతో సోడియం అధికంగా ఉంటున్న ఫుడ్ను తీసుకోవడం వల్ల చనిపోతున్నారు. వారు బేకింగ్ ఫుడ్.. బ్రెడ్, పప్పులు, ప్రాసెస్డ్ మీట్, డైయిరీ ప్రాడాక్ట్స్ వల్ల వస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.ఇది శరీరంలోని నీటి శాతాన్ని క్రమబద్ధీకరణ చేస్తుంది. ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించేందుకు అధికారులు కొన్ని పాలసీలు తప్పకుండా జారీ చేయాలి. ప్రజలకు కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదో చెప్పాలని డబ్ల్యూహెచ్ఓ జనరల్ డైరెక్టర్ టెడ్రాస్ అధానమ్ గెబ్రియాసిస్ తెలిపారు. ప్రాసెస్డ్ ఫుడ్లో సోడియం శాతాన్ని తగ్గించే విధానాన్ని అమలు చేయాలన్నారు.
ఇందుకు సంబంధించి 64 రకాల ఫుడ్, డ్రింక్ల కేటగిరీలుగా చేశారు..అధిక శాతం ఉప్పు తీసుకోవడం వల్ల బిపి విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల కార్డియక్ వ్యాధులు పెరుగుతాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీనివల్ల మరణం కూడా సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 32 శాతం చావులు ఇటువంటివేనని చెప్పింది. అదేవిధంగా ఒబేసిటీ, కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రిక్ కేన్సర్ కూడా వస్తుంది. అందుకే రోజుకు 5 గ్రాములు మించి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.. చూసారుగా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో... ఇప్పటి నుంచి ఉప్పు వినియోగాన్ని తగ్గించండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..