లైఫ్ స్టైల్: బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఇది మీకోసమే..?
ముఖ్యంగా పెరుగు , పండ్లు, గింజలు, విత్తనాలతో బ్రేక్ ఫాస్ట్ అని మీరు తయారు చేసుకోవచ్చు. ముందుగా గ్రీక్ పెరుగు అరకప్పు తీసుకొని, ఆపిల్ సగం సన్నగా తరిగినది, అలాగే పీచ్ సగం, దానిమ్మ గింజలు పావుకప్పు, గుమ్మడి గింజలు ఒక చెంచా, అవిసె గింజల పొడి ఒక చెంచా, ఎనిమిది నానబెట్టిన బాదంపప్పు గింజలు అన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి పెరుగులో వేసి బాగా కలపాలి. అయితే చాలామంది దీనిని మిక్సీలో పట్టుకొని పాలల్లో కలుపుకు తాగడానికి ఇష్టపడతారు. ఒకవేళ మీరు అలా ఆలోచిస్తున్నట్లయితే అలా చేసిన సరిపోతుంది . కానీ ఇలా నేరుగా పండ్లను తినడం వల్ల దంత సమస్యలు దూరం అవడమే కాకుండా మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
ఇక ఇంకొక అల్పాహారం విషయానికి వస్తే.. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరటిపండు, బాదం పప్పులు నాలుగు, పాలు పావు లీటరు, దాల్చిన చెక్క పొడి పావు టీ స్పూన్ వేసి అన్ని మిక్సీ పట్టాలి . ఈ స్మూతీని గ్లాస్ లో వేసుకొని తాగడం వల్ల మీ ఆరోగ్యానికి మంచి ఆహారాన్ని అందించిన వారు అవుతారు . ఇక బరువు తగ్గడానికి ఈ స్మూతీ చాలా బాగా పనికొస్తుంది. అలాగే గ్రీన్ ఆపిల్ , స్పినాచ్ స్మూతీ కూడా మీ బరువును తగ్గిస్తుంది అని చెప్పవచ్చు.