పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలు ఏంటో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో చదువుల్లో,ఆటల్లోనూ ఎందులోనూ చురుగ్గా ఉండకుండా వెనకబడుతున్నారు.కొంతమందికి అయితే కొన్ని విషయాలను చెప్పి వారిని రిపీట్ చేయమంటే కూడా వారు చేయలేకపోతూ ఉంటారు.దీనికి కారణం వారి మతిమరుపే.కొంతమంది తల్లిదండ్రులు వారిలో ఇలాంటి లోపాన్ని గమనించిన కూడా అంతగా పట్టించుకోరు.ఇలాగే పిల్లలను జ్ఞాపకశక్తి లోపాలతో ఏమీ కాదులే అని వదిలేస్తే,భవిష్యత్తులో వారు ఇతర పిల్లలు లాగా వృద్ధి చెందకుండా అక్కడే ఆగిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా..మరియు కొన్ని పరిశోధనల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువగా జ్ఞాపకశక్తి లోపాలతో బాధపడుతున్నారు అని చెబుతున్నారు.పిల్లల్లో మెదడు పనితీరును దెబ్బతీసే కారణాలు ఏంటో తెలుసుకుందాం పదండి..

బ్లూ స్క్రీ లు..

బ్లూ స్క్రీన్లు కలిగిన టీవీ మరియు మొబైల్ లు ఎక్కువగా చూడటం వల్ల మెదడు పనితీరు మందగించి, జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంది.దీనితో వారు తోటి వారి పేర్లను కూడా మర్చిపోతూ ఉంటారు కూడా.దానికి కారణం ఎక్కువగా మొబైల్ లో గేమ్ ఆడటం, ఆడియోలు,వీడియోలు చూడడం వల్ల మెదడు ఆలోచన శక్తిని కోల్పోతూ ఉండడమే.కావున ఎంత స్క్రీన్ వాడకం తగ్గిస్తే అంత మంచిది.

అధిక ఆహారం తీసుకోవడం...

చాలామంది పిల్లలు టీవీ మొబైల్ చూస్తూ ఏం తింటున్నామో కూడా లెక్క చేయకుండా,అధిక చెక్కరలు మరియు కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ లను స్వీట్ లను  ఎక్కువగా తింటూనే ఉంటారు.మరియు కొంతమందికి ఏదో ఒకటి తింటూ ఉంటేనే కానీ వారి రోజు గడవదు అన్నట్టు ఉండే పిల్లలు కూడా ఉన్నారు.ఇలా చేయడం వల్ల క్రమంగా మెదడు పనితీరు దెబ్బతిని,ఆలోచన శక్తి మందగిస్తుంది.అంతేకాక వారి జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

శారీరక శ్రమ లేకపోవడం..

చాలామంది పిల్లలకు అవుట్డోర్ గేమ్స్,వ్యాయామం మరియు నడక వంటి ఎటువంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడు కూడా నిద్రావస్థకు చేరి,జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది కూడా.కావున ఇటువంటి వాటికి దూరంగా ఉంచి,మీ పిల్లల్లో మెదడు పెరుగుదలకు,మరియు జ్ఞాపకశక్తి మెరుగు
పడేందుకు జాగ్రత్త పడటం తల్లిదండ్రుల వంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: