ఎక్కువగా నీరు తాగితే కలిగే నష్టాలు?

Purushottham Vinay
ఎక్కువగా నీరు తాగితే కలిగే నష్టాలు?


మనం అన్నం తినకుండా అయినా జీవించగలం కానీ నీళ్లు తాగకుండా మాత్రం అస్సలు జీవించలేం. నీరు మన శరీరానికి చాలా అవసరం.మంచి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా తగినంతగా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే తగిన స్థాయిలో నీటిని తాగడం వల్ల మానవ శరీరం అలసిపోకుండా చాలా చురుగ్గా ఉంటుంది.అయితే చాలా మంది కూడా నీటిని  పరిమితికి మించి ఎక్కువగా తాగుతుంటారు. అయితే అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనాట్రేమియా అనే సమస్య ఖచ్చితంగా ఎదురవుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత.. ముఖ్యంగా సోడియం ఇంకా అధిక నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య సంభవిస్తుంది.అలాగే ఎక్కువగా నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. అందువల్ల  పనిచేసే సామర్థ్యం తగ్గడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే శక్తి కూడా నశిస్తుంది. 



ఇంకా అధిక నీటి కారణంగా ఎదురయ్యే హైపోనాట్రేమియా లక్షణాల్లో భాగంగా వికారం, రక్తపోటు, తలనొప్పి, గందరగోళం, మూర్ఛ, కోమా ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి.ఇంకా ఇవే కాక బరువు పెరిగే సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.ఎక్కువ నీటిని తాగడం కారణంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. రోజువారీ అవసరం, వయసు, బరువు, కార్యాచరణ స్థాయి ఇంకా వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఒక సాధారణ వ్యక్తి రోజుకు 8 గ్లాసులు లేదా 2 లీటర్ల నీరు తాగితే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. అలా అని మరీ తక్కువగా కూడా నీరు తాగవద్దని, దాని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఎక్కువ నీరు కాకుండా తగినంత నీరు మాత్రమే తాగండి.ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: