కాలిన గాయల వల్ల మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. ఈ కాలిన గాయలు త్వరగా తగ్గి మంట, నొప్పి వంటి బాధలు తగ్గడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల కాలిన గాయాలు చాలా త్వరగా తగ్గుతాయి.ఈ కాలిన గాయలను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ టీ బ్యాగులను ఫ్రిజ్ లో కొద్ది సేపు ఉంచి ఆ తరువాత వీటిని కాలిన గాయలపై ఉంచాలి.బ్లాక్ టీ ఉండే టానిక్ యాసిడ్ చర్మానికి మంచి స్వాంతనని అందిస్తుంది. ఇంకా అలాగే నొప్పి, మంట కూడా ఈజీగా తగ్గుతాయి. అలాగే ఈ కాలిన గాయలపై రాత్రి పడుకునే ముందు తేనెను రాయాలి.ఎందుకంటే ఈ తేనె యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.మనం తేనెను రాయడం వల్ల ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి.అలాగే కాలిన గాయలపై పాలను కూడా రాయాలి. ఇలా చేయడం వల్ల కాలిన గాయాలు చాలా త్వరగా తగ్గుతాయి. అలాగే ఈ గాయల వల్ల మంట ఎక్కువగా అనిపించినప్పుడు చల్లటి పాలల్లో దూదిలో ముంచి గాయాల మీద బాగా రాయాలి.
ఇలా చేయడం వల్ల మంట ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే కాలిన గాయలపై పుదీనా ఆకుల పేస్ట్ ను రాయాలి. ఇలా రాయడం వల్ల కాలిన గాయాల వల్ల కలిగే మంట తగ్గడంతో పాటు గాయాలు కూడా చాలా త్వరగా మానుతాయి. ఇంకా అలాగే ఈ పేస్ట్ ఎండిన తరువాత నీటిని చల్లి నెమ్మదిగా తొలగించాలి. ఇంకా అలాగే కాలిన గాయలు మానిన తరువాత ఆ భాగంలో చర్మం తెల్లగా కూడా ఉంటుంది.ఇలాంటప్పుడు మీరు నేరుడు ఆకులను తీసుకొని వాటిని ముక్కలుగా చేసి కళాయిలో వేసి నల్లగా అయ్యే దాకా వేయించాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. తరువాత ఈ పొడిని తగిన మోతాదులో తీసుకుని దానికి నువ్వుల నూనెను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను రోజుకు రెండు పూటలా కూడా కాలిన గాయాలపై రాయడం వల్ల క్రమంగా తెల్ల మచ్చలు కూడా నల్లగా మారతాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల కాలిన గాయల వల్ల కలిగే మంట, నొప్పి తగ్గడంతో పాటు గాయాలు కూడా ఈజీగా మానతాయి.