ఈ పానీయం తాగితే జలుబు, దగ్గు, జ్వరం రావు?

Purushottham Vinay
ప్రస్తుతం వానలు బాగా దంచి కొడుతున్నాయి. అందువల్ల వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. దీంతో మన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇక వాతావరణం చల్లబడుతున్న కొద్ది మన జీవక్రియ కూడా పూర్తిగా నెమ్మదిస్తుంది.జలుబు, దగ్గు, కొన్ని రకాల అంటూ వ్యాధులు వర్షాకాలంలో కచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ వాతావరణంలో మార్పులు జరుగుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో చాలా రెమెడీలు ఉన్నాయి. వర్షాకాలంలో శరీరాన్ని కాపాడుకోవడం కోసం ‘కధా’ లేదా ‘కారా’ అనే పానీయాన్ని తయారు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అయితే దీన్ని తాగితే ఎలాంటి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఇంకా జలుబు వంటివి రాకుండా ఉంటాయి. ఇంకా ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.అందుకే రుచి కూడా అదిరి పోతుంది.స్టవ్ మీద కళాయిని పెట్టి నీరు వేయాలి. తరువాత ఆ నీటిని మరిగించాలి. ఈ లోపు అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వంటి వాటిని మిక్సీలో వేసి వాటిని మెత్తగా చేసుకోవాలి. ఆ నీరు మరిగిన తర్వాత ఆ నీటిలో తులసి ఆకులతో పాటు ఈ మిశ్రమాన్ని కూడా వేయాలి. ఇలా ఒక 20 నిమిషాలు పాటు మరిగిస్తే కషాయం రెడీ అయినట్టే.



దీన్ని గ్లాసులో వడకట్టి వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి. తరువాత తేనెను కలపాలి.ఇక ‘కధా’ పానీయం రెడీ అయినట్టే.ఈ పానీయంలో యాంటీ వైరల్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఇవి దగ్గు, జలుబుపై ప్రభావంతంగా పనిచేస్తాయి.ఇందులో ఉండే తులసి శరీరంలో శ్లేష్మం ఏర్పడకుండా తగ్గించేందుకు చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సిద్ధం చేస్తుంది. అలాగే ఇది క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇంకా గొంతు నొప్పి, దురద వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రసం దగ్గు, జలుబు, ఫ్లూ ఇంకా జ్వరం వంటి వాటికి చికిత్స చేయడమే కాదు, కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఈ రసాన్ని ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తాగితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: