ఈ చలి కాలంలో డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా కూడా బాడీలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చలి కాలంలో తీసుకునే ఆహార విషయంలో, లైఫ్ స్టైల్ లో ఖచ్చితంగా అనేక మార్పులు చేసుకోవాల్సిందే.మరి ఆ చిట్కాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.డయాబెటీస్ తో ఉన్నవారు ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి ఖచ్చితంగా తగ్గించుకోవాలి. షుగర్ ఉన్న వారిలో ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఇంకా నడుము నొప్పులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శీతా కాలంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి ఎక్కువ అయితే షుగర్ లెవల్స్ అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.డయాబెటీస్ ఉన్నవారు వింటర్ సీజన్ లో తప్పకుండా ప్రోటీన్స్, విటమిన్లు ఇంకా ఫైబర్ ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవాలి.
ప్రోటీన్స్, ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకుంటే ఆకలిని తగ్గించి.. జీవ క్రియను బాగా మెరుగు పరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలులు అనేవి పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇక షుగర్ ఉన్న వారు చలి కాలంలో ఆహారాన్ని ముందే తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో సూర్య కాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది.అందువల్ల జీర్ణ క్రియ అనేది నెమ్మదిగా సాగుతుంది. ఇంకా అలాగే పండ్లు, పచ్చి కూరగాయలు, తృణ ధాన్యలు అనేవి సాయంత్రం కంటే ముందే తీసుకోవాలి.డయాబెటీస్ ఉన్న వారు ఖచ్చితంగా ఈ వింటర్ సీజన్ లో వ్యాయామం చేయాలి. లేదంటే శరీర బరువు అమాంతం పెరిగి పోతుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఉదయం లేదా సాయంత్రం 30 నిముషాలు పాటు ఎక్సర్ సైజ్ లు చేయండి. లేదా వాకింగ్, యోగా వంటివి చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవడం వల్ల.. షుగర్ లెవల్స్ పై ప్రభావం పడదు.