కనుమరుగవుతున్న సముద్ర జీవులు.. భారీ విపత్తులకు సంకేతం..!

lakhmi saranya
ఇల్లు ఎంత సుబ్బరంగా ఉంచుకుందాం అనుకున్న సూక్ష్మజీవులు ఏర్పడుతూనే ఉంటాయి. తినే దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఈ జీవులు ఉంటాయి. సముద్ర జీవులు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరిస్తుంది తాజా ఆధ్యాయనం. పట్స్ డ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైయేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ నివేదిక ఈ విషయంపై ఆందోళన లేవనెత్తుతుంది. సముద్రపు ఆమ్లీకరణ కీలకస్థాయికి చేరుకుంటుందని... భారీ స్థాయిలో నీరు ఉప్పగా మారడం వల్ల సముద్ర జీవులకు, పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర ముప్పును కలిగిస్తుందని చెప్తుంది. మానవ కార్యకలాపాల నుంచి వెలువాడే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గ్రహించడం వల్ల ప్రపంచ మహా సముద్రాలు మరింత ఆమ్లంగా మారుతున్నాయని వివరించింది.
CO2 ఉద్గారాలు పెరిగేకొద్ది, అందులో ఎక్కువ భాగం సముద్రపు నీటిలో కరిగి, అధిక ఆమ్లత్వ స్థాయికి దారి తీస్తుందని వివరించారు పరిశోధకులు. సముద్ర ఆమ్లీకరణ అని పిలవబడే ఈ ప్రక్రియ సముద్ర పర్యావరణ వ్యవస్థల సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది. సముద్ర ఆహార వెబ్ లో ముఖ్యమైన పగడాలు, షెల్ఫిష్, ఫైటో ప్లాంక్టన్ లను దెబ్బతీస్తాయి. క్లామ్స్ , గుల్లలు వంటి షెల్ఫిష్ లు వాటి పెంకులను ఏర్పరుచుకోవటం ఇబ్బందులను ఎదుర్కుంటాయి. సముద్రపు ఆహార గొలుసుకు పునాది అయినా ఫైటో ప్లాంక్టన్ కూడా ఆమ్లీకరణ ద్వారా ప్రభావితం అవుతుంది.
ఈ మైక్రోస్కోపిక్ జీవులు కార్బన్ సిక్విస్ట్రేషన్, ఆక్సిజన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి క్షినత మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది, చేపలు, సముద్ర క్షిరదాలతో సహా ఆహారం కోసం వాటిపై ఆధారపడే జంతువులను ప్రభావితం చేస్తుంది. సముద్ర ఆమ్లీకరణ చిక్కులు సముద్ర జీవులకు మించి ఉండనున్నాయి. మహా సముద్రాలు మొత్తం CO2 ఉద్గారాలలో 25% గ్రహిస్తాయి. ఈ ఉద్గారాల ద్వారా ఉత్పన్నమయ్యే అదనపు వేడిలో 90% ని సంగ్రహిస్తాయి. అయితే ఇవి భారీ స్థాయిలో ఆమ్లంగా మారినట్లయితే... ఈ విధులను నిర్వహించే సామర్థ్యం తగ్గిపోతుంది, గ్లోబల్ వార్నింగ్, వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తుంది. సముద్ర పర్యావరణ వ్యవస్థలు,విస్తృత వాతావరణ వ్యవస్థకు మరింత నష్టం చేరకుండా నిరోధించడానికి CO2 ఉద్గారాలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నివేదిక నోక్కి చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: