ఈ రాశుల వారికి అతీంద్రియ శక్తులు.. అందుకే వాళ్లు దెయ్యాలను చూడగలరట...!

lakhmi saranya
కొంతమంది మనుషులు తమ అప్పుడప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకో ఏమో తెలియదు ఒక్కసారిగా వింత వింతగా చేస్తూ ఉంటారు. గాలి సోకినట్టు చేస్తారు. కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తమకు దయ్యాలు, గాలి, ఆత్మలు కనిపించాయని చెబుతుంటారు. మరికొందరైతే వారు ఆత్మలతో మాట్లాడతాం అని చెబుతారు. అయితే వారికి నిజంగానే ఆత్మలు, దెయ్యాలు కనిపిస్తాయా అన్న అనుమానాలు ఎదుటి వారిలో వస్తుంటాయి. అయితే కొన్ని రాజుల వారికి ఆ శక్తి ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఓ మనిషి పుట్టిన తిధి, రాశి , నక్షత్రాన్ని బట్టి వారికి అది సాధ్యం అని చెబుతున్నారు. కొన్ని రాశులలో, తిధులలో పుట్టిన వారికి ఆతింద్రియ శక్తులు ఉంటాయని చెబుతున్నారు పండితులు.
ఇంతకీ ఆ రాశులు ఏంటి, వారికి ఎలాంటి శక్తులు ఉంటాయన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మనకు 12 రాసులు ఉంటాయి. ఒక్కో రాశి వారికి ఒక్క స్వభావం ఉంటుంది. కొంతమంది అతిగా మాట్లాడితే, కొంతమంది అసలు మాట్లాడారు, కొంతమంది అతిగా పనులు చేస్తే, మరికొంతమంది బద్దకంగా ఉంటారు. ఇలా అనేక స్వభావాలతో ఉంటారు. ఇక మరి కొంతమంది మౌనంగా ఉండి, ప్రపంచంతో మనకు సంబంధం లేదు అన్నట్లుగా ఉండి, ఎప్పుడూ దిక్కుల వైపున చూస్తూ ఉంటారు.
 దీనికి కారణం వారిలో ఉండే అతీంద్రియ శక్తులే అంటారు పండితులు. అంతే కాదు వారు ప్రత్యేక పద్ధతిలో, ప్రత్యేకమైన వస్తువులను భద్రపరుచుకుంటుంటారట. అలాగే ఎవరూ కనిపెట్టలేని విషయాలను మీరు కనిపెటవారట, ఎవరు గుర్తించని కొన్నిటిని వీరు గుర్తిస్తారట. ఇలాంటి లక్షణాలున్న రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా. మిధున రాశి : ఈ రాశి వారికి అధిపతిగా బుధ గ్రహం ఉంటుంది. ఈ గ్రహాన్ని సమాచార గ్రహం అంటారు. ఈ రాశి వారు గ్రహాంతర శక్తులు, దయ్యాలు, అపరిచితుల నుంచి రహస్యాలను వినేందుకు ఉత్సాహం చూపిస్తారట. వీరికి నిద్రలో కనిపించే కలలు స్పష్టంగా ఉంటాయట. అంతే కాదు ఎవరైనా ఏదైనా విషయం గురించి భయపెడితే అలాంటి విషయాలను గుర్తించి ఎక్కువ మాట్లాడుతుంటారు అంటున్నారు పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: