ఆల్కహాల్ అధికంగా సేవిస్తే అకాల మరణం... రక్తంలో టాక్సిక్ మెటల్స్ పెరగడమే కారణమా..?

lakhmi saranya
ఈరోజుల్లో చాలామంది ఆల్కహాల్ను ఎక్కువగా తాగుతున్న విషయం తెలిసింది. ఎక్కువగా ఆల్కహాల్ తాగటం వల్ల మరణిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఆల్కహాల్, గంజాయి, పొగాకు వంటి మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే ఇవి బాధితుల రక్తంలో, యూరిన్ లో విష పదార్థాల అభివృద్ధికి కారణమై అకాల మరణానికి కూడా దారితీస్తాయని కొలంబియాలోని మెయిల్ మన్ స్కూల్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు అధ్యాయనంలో వెళ్లడైంది. దీర్ఘకాలం పాటు మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉన్న వారిలో ఆయు ప్రమాణం తగ్గుతున్నట్లు వారు గుర్తించారు.
 ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉపయోగించే మత్తు పదార్థాల్లో పొగాకు, ఆల్కహాల్, గంజాయి వంటివి ప్రధానంగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఆరోగ్యంపై వీటి ప్రభావాన్ని తెలుసుకునేందుకు వారు 2018 నుంచి 2005 మధ్య కాలం నాటి కొలంబియన్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే డేటాను ఎనలైజ్ చేశారు. అలాగే 2023 నాటి ఒక ఆప్యాయనాన్ని కూడా విశ్లేషించారు. కాగా మొత్తం 7,354 మంది గంజాయి, ఆల్కహాల్, పొగాకు అలవాట్లు కలిగిన వారిని, ఎటువంటి అలవాట్లు లేని వారిని పోల్చి చూశారు.
అయితే వీరిలో పొగాకు, ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకునే వారి రక్తంలో,యూరిన్ లో మాత్రమే నికోటిన్, కాడ్మియం, సీసం వంటి టాక్సిక్ మెటల్స్ తో అటు ఇతర విష పదార్థాలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ బాధితుల్లో కాలేయ వైఫల్యం, గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక వ్యాధులు వంటి అనారోగ్యాలకు దారితీస్తాయని, వారి జీవిత కాలాన్ని తగ్గించటం ద్వారా అకాల మరణాలకు కారణం అవుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. కాబట్టి ఆల్కహాల్ ని అస్సలు తీసుకోకండి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలుని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలం పాటు మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉన్న వారిలో ఆయు ప్రమాణం తగ్గుతున్నట్లు వారు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: