ఆ వార్త చూసి షాక్ అయ్యా!
తెలుగు, తమిళ భాషల్లో లారెన్స్ ప్రధాన పాత్రను పోషించిన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా సీక్వెల్ గా కాంచన3 రాబోతున్న విషయం తెలిసిందే. అయితే కాంచన మూవీ కన్నడ భాషలో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను 'లక్ష్మీ' పేరుతో హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా .. కైరా అద్వాని కథానాయికగా ఈ సినిమాలో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో శోభిత ధూళిపాళ చేయనుందనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి.
ఈ సినిమాలో అవకాశం లభించినందుకు గాను ఆమెను అభినందిస్తూ సన్నిహితులు కాల్స్ చేయడం .. మెస్సేజ్ లు పెట్టడం చేస్తున్నారట. తాజాగా ఈ విషయంపై శోభిత స్పందించింది. ఇటీవల నేను చేస్తున్న సినిమాలు, పోషించిన పాత్రలు ప్రేక్షకులకు చేరాయనే విషయం చాలా సంతోషంగా ఉంది. నిజాయితీగా చేసిన పాత్రలు, హార్డ్ వర్క్ నాకు మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
అయితే బాలీవుడ్ లో అక్షయ్ సరసన నటిస్తు అన్నవార్తు చూసి అందులోనూ గూగుల్లో వచ్చిన వార్త తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయిందట. గతంలో అలాగే తానాజీ: ది అనసంగ్ వారియర్ అనే చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ రూమర్లే అని శోభిత వెల్లడించింది. ఆ తరువాత .. ఆ సినిమాకి సంబంధించిన వాళ్లెవరూ తనని సంప్రదించలేదనీ .. తాను ఈ సినిమా చేయడం లేదని తెలిపింది.