వాటిపై బోర్ కొట్టింది.. కొత్తగా రాయండి..!

shami
ఓ సూపర్ హిట్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చినా.. అలా వచ్చిన క్రేజ్ ను వాడుకోవడంలో వెనకపడి కెరియర్ డైలమాలో పడేసుకున్న హాట్ బ్యూటీ హెబ్భా పటేల్. మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియకపోయినా కుమారి 21ఎఫ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. సుకుమార్ చేతుల్లో పడ్డాక అమ్మడి కెరియర్ కు తిరుగు లేదని అనుకున్నారు కాని ఆ సినిమా తర్వాత కథల విషయంలో ఆమె చేసిన పొరపాట్లు ఆమెను కెరియర్ లో వెనకపడేలా చేశాయి.    
హీరోయిన్ గా ఛాన్సులు రాకపోయినా చిన్న చిన్న పాత్రలకు సై అంటుంది హెబ్భా పటేల్. నితిన్ భీష్మ సినిమాలో వ్యాంప్ రోల్ లో కూడా కనిపించి షాక్ ఇచ్చింది హెబ్భా పటేల్. హీరోయిన్ కనబడితే చాలు పెళ్ళెప్పుడు అని అడగడం కామనే. హెబ్భా పటేల్ ను కూడా ఇలా రెండు మూడుసార్లు అడిగారట. నా పెళ్ళికి మీ తొందర ఏంటని అమ్మడు సమాధానం ఇచ్చిది. అంతేకాదు తనకు ఓ హీరోతో రిలేషన్ అంటకడుతూ వార్తలు రాస్తుంటారు. ఇలా పాత రూమర్స్ తో తనకు బోర్ కొట్టింది కొత్తవి ఏవైనా రాసుకోండని చెబుతుంది హెబ్భా పటేల్.
ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో నటిస్తున్న హెబ్భా పటేల్ ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో సరైన కథల ఎంపిక చేసుకోలేని హెబ్భా పటేల్ మరో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. రాజ్ తరుణ్, మాళవిక నాయర్ కాంబోలో వస్తున్న ఒరెయ్ బుజ్జిగా సినిమాలో హెబ్భా కూడా నటించింది. ఈ సినిమాను విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేశారు.                                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: