స్టేజి పైన ఎమోషనల్ అయిన చాందినీ చౌదరీ
ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్లో ఉండగా.. దర్శకుడు ప్రవీణ్ యాక్సిడెంట్కి గురి అయ్యి కన్నుమూశారు. దాన్ని గుర్తు చేసుకున్న చాందినీ.. స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్ మీద ప్రవీణ్ ఈ చిత్రాన్ని బాగా తీశాడు. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాము. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన చాందిని ని హీరో నవీన్ చంద్ర ఆమెను ఓదార్చడం విశేషం .. ఇక హీరో మాట్లాడుతూ.. మేము ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం. ప్రవీణ్ తో గడిపిన క్షణాలను అలాగే ఈ ప్రెస్ మీట్ అయన లేకోవడం ఈ రెండు మమల్ని ఎమోషనల్ గా మార్చాయి ..
కాగా ప్రవీణ్ టాలీవుడ్ దర్శకుడు సుధీర్ వర్మ వద్ద అసిస్టెంట్గా పనిచేసారు. అతడే ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో సీన్ని వివరిస్తూ ఓ యాక్సిడెంట్కి గురైన ప్రవీణ్.. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మొదటి సినిమా విడుదల కాకాముందే మరణించిన ఈ దర్శకుడి హఠాణ్మరణం టాలీవుడ్లో విషాదాన్ని నింపింది. అలాగే సినిమా లో పనిచేసిన ప్రతి ఒక్కరు దర్శకుడితో పనిచేసిన రోజులని మరిచిపోలేకపోతున్నారు .. అందుకే హీరోయిన్ స్టేజి పైన ఏడవడం, హీరో ఓదార్చడం వంటివి జరిగాయి .. కొన్ని రోజులు ఒక మనిషితో జర్నీ చేసి సడెన్ గా ఆ మనిషి మరణ వార్త తెలిస్తే ఎవరికైనా బాధ కలగడం సహజం ..