పవన్ కళ్యాణ్, రానా పాత్రలను సరిసమానంగా రూపుదిద్దుతున్న త్రివిక్రమ్..

Suma Kallamadi
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి "అయ్యప్పనుమ్‌ కొషియమ్" అనే ఓ మలయాళ మూవీ రీమేక్ లో కలిసి నటించనున్నారు. ఈ విషయాన్ని దగ్గుబాటి రానా కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. దీంతో రానా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ టాపిక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక యాక్షన్ సినిమాలో స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కలిసి నటిస్తే కెవ్వు కేక అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని మెయిన్ పాత్రల్లో నటించే పవన్, రానా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. ఇద్దరు కూడా అహంతో కొట్లాడుతుంటారట. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.


అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత దర్శకుడు తమన్.. పవన్ - రానా కాంబో మూవీ కి స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "అయ్యప్పనుమ్‌ కొషియమ్" తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి పాత్రలకు సంబంధించిన స్క్రీన్ ప్లే ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సరిసమానంగా రాస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రెండు పాత్రలు కూడా చాలా స్ట్రాంగ్ గా స్క్రీన్ మీద కనిపించే లాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ సృష్టించబోతున్నారు అని చెప్పుకొచ్చారు.


ఈ రీమేక్ సినిమాకి సంబంధించి తాను ఇప్పటికే సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కసర్ల శ్యామ్ రచించిన మూడు పాటలను కూడా స్వరపరిచానని తమన్ వెల్లడించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా 2021 ఏడాదిలోనే సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ తో పాటు రానా హీరోగా నటించిన విరాట పర్వం కూడా విడుదల కానుంది.


పవన్ కళ్యాణ్, రానా పాత్రలను సరిసమానంగా రూపుదిద్దుతున్న త్రివిక్రమ్.. "అయ్యప్పనుమ్‌ కొషియమ్" తెలుగు రీమిక్స్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సమానం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కాలంలో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: