నాగబాబు వారసురిడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే వరుణ్ మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాధించుకున్నాడు. వరుణ్ తన కెరీర్ లోనే మొదటి సారిగా చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఘని కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.సినిమాలో బాలీవుడ్ భామ సాయి మంజ్రీకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు నవీన్ చంద్ర, సునీల్ శెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తున్నారు. భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు, మెగా అభిమానులకు ఎన్నో అంచనాలున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీగా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. దాంతో ఈ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వియాడ్ రిమ్ బర్గ్ లు రంగంలోకి దిగుతున్నారట.
ఈ స్టంట్ మాస్టర్ లు హాలీవుడ్ లో కార్బన్, టైటాన్స్, బాలీవుడ్ లో రైడ్ ,సుల్తాన్, పైల్వాన్ సినిమాలకు పనిచేశారు. అంతే కాకుండా షేట్ ఆఫ్ ఫ్యూరియస్, సినిమాలకు కూడా పనిచేసినట్టు తెలుస్తుంది. ఇక తెలుగులో బాహుబలి చిత్రానికి సైతం పనిచేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా విజృంభన నేపథ్యంలో ఘని సినిమా షూటింగ్ వాయిదా పడింది. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించేందుకు వరుణ్ తేజ్ జిమ్ లో కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని వరుణ్ తేజ్ భావిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ ప్రస్తతం ఎఫ్ 3 సినిమాలోనూ నటిస్తున్నారు. ఎఫ్ 2 మంచి విజయం సాధించడంతో ఎఫ్ 3పై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది.