ఆ విషయంపై పక్కా క్లారిటీ ఇచ్చిన అడివిశేష్..!

Pulgam Srinivas
అడవి శేష్ ప్రస్తుతం 26 /11 దాడుల సమయంలో తన ప్రాణాలకు తెగించి, ఎంతోమందిని కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న 'మేజర్' సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అడవి శేష్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, సైయూ మంజ్రేకర్,  శోభితా ధూళిపాల ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో ఎంతో ధైర్యసాహసాలు కలిగిన ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానాన్ని మాత్రమే కాకుండా అతను జీవించిన విధానాన్ని కూడా చూపించబోతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసింది, కానీ భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్ ని వాయిదా వేయవలసి వచ్చింది. అయితే ఈ సినిమాను 'ఓటిటి' లో విడుదల చేయబోతున్నారు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి

. కానీ ఆ వార్తలపై మొదటినుండి చిత్రబృందం క్లారిటీ ఇస్తూనే ఉంది. తమ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తాము అని సినిమా మేకర్స్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ విషయమై మరోసారి హీరో అడవి శేష్ క్లారిటీ ఇచ్చారు. మేజర్ సినిమా ఆఖరి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది అంటూ ట్వీట్ చేసిన అడివిశేష్. ఈ సినిమాను మీ ముందుకు తీసుకు వచ్చేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రేక్షకుల అందరికోసం ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తాం. అది పరిస్థితులు బాగుంటేనే.. మన 75 వ స్వాతంత్ర దినోత్సవం కూడా దగ్గరలోనే ఉంది అంటూ అడవి శేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక తెలుగు మరియు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లపై ఈ సినిమాను తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: