కొండపొలం బాగానే ఉంది .... కానీ .... ??

GVK Writings
యువ నటుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలిసారిగా ఉప్పెన మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఆ సినిమా సూపర్ హిట్ తో మంచి పేరు అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి వైష్ణవ్ నటించిన లేటెస్ట్ సినిమా కొండపొలం.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కొటారు రవీంద్ర యాదవ్ గా వైష్ణవ్ అలానే ఓబులమ్మ గా రకుల్ ప్రీత్ కనిపించారు. హేమ, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, అన్నపూర్ణ, నాజర్ తదితరులు కీలక పాత్ర చేసిన ఈ సినిమా మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
నవల యొక్క మూల అంశాన్ని ఎక్కడా కూడా మిస్ చేయకుండా సినిమాని దర్శకుడు క్రిష్ ఎంతో బాగా తీసారని అంటున్నారు. అయితే సినిమాపై చాలా మంది ప్రేక్షకులు మంచి ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం మూవీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎంతో సాగ దీశారని, మధ్యలో వచ్చిన కొంత ల్యాగ్ వలన బోర్ కొట్టిందని అంటున్నారు. కాగా కీరవాణి సాంగ్స్, హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలో పాత్ర దారుల సహజ నటన మాత్రం సినిమాకి పెద్ద హైలైట్ అని అంటున్నారు. మొత్తంగా మంచి టాక్ ని ఈ కొండపొలం మూవీ సొంతం చేసుకోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ సంబరాల్లో మునిగిపోయింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: