మహేష్ మూవీ అల్లు అరవింద్ చేతికి ... మ్యాటర్ ఏంటంటే .... ??
14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన బ్లాస్టర్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు అది సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాని మూవీ యూనిట్ సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని అల్లు అరవింద్ కి చెందిన ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా అత్యధిక ధరకు కొనుగులు చేసినట్లు చెప్తున్నారు.
ఇప్పటికే సర్కారు వారి పాట టీమ్ తో దీనికి సంబంధించి డీల్ కూడా కుదరగా దీని అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు సమాచారం. సముద్రఖని విలన్ గా నటిస్తున్న ఈ సినిమాని యాక్షన్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ తీస్తున్నారని, అలానే విడుదల తరువాత సర్కారు వారి పాట మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.