స్టార్ హీరోయిన్స్ కే పోటీ అంటే మాటలా..?
కృతిసనన్ తెలుగు సినిమాలతో తన సినీ కెరీర్ మొదలు పెట్టింది. మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'హీరోపంటి'తో బాలీవుడ్కి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడలేదు. మీడియం రేంజ్ సినిమాలతోనే తన కెరీర్ నెట్టుకొస్తోంది. ఇలాంటి సమయంలో 'ఆదిపురుష్'తో క్రేజీ ఆఫర్ అందుకుంది కృతిసనన్.
'ఆదిపురుష్' వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఇక కృతి సీత పాత్ర పోషిస్తుంది అనగానే బాలీవుడ్ జనాలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సమయంలోనే వచ్చిన 'మీమీ' సినిమా చూసి కృతి బెస్ట్ పెర్ఫామర్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
కృతి సనన్కి ఇప్పుడు హిందీలో బంపబర్ ఆఫర్స్ వస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్తో 'షెహజాదా' అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ 'అలవైకుంఠపురములో' సినిమాకి రీమేక్గా తెరకెక్కుతోంది. అలాగే అక్షయ్ కుమార్తో 'బచ్చన్పాండే', వరుణ్ ధావన్తో 'భేడియా' సినిమాలు చేస్తోంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ క్యూలో ఉన్నాయి. ఈ మూవీస్తో కృతి టాప్ లీగ్కి దగ్గరవుతోందనే టాక్ వస్తోంది. మరి కృతి అనుకున్న విధంగా అన్ని సవ్యంగా జరుగుతాయో లేదో చూడాలి.