విడాకుల తరవాత తమ పార్ట్నర్ కు సంబంధించిన గుర్తులు కోపాన్ని..బాధను తెప్పించే అవకాశం ఉంటుంది. ఎలాగూ మళ్లీ కలుసుకోలేని జ్ఞాపకమే కాబట్టి వీలైనంత వరకూ తుడిచివేయాలనే ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా లైఫ్ లో ముందుకు వెళ్లాలంటే ఆ గుర్తులను చెరిపివేయడమే మంచిదని భావిస్తుంటారు. కాగా రీసెంట్ గా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య సమంత విషయంలోనూ అదే విషయం జరుగుతున్నట్టు తెలుస్తోంది. సమంత మెల్లి మెల్లిగా నగ చైతన్యకు సంబంధించిన గుర్తులను చెరిపివేసే ప్రయత్నం చేస్తుందట. ఈ నేపథ్యంలోనే సమంత తన సోషల్ మీడియాలో నాగ చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను లేకుండా డిలీట్ చేసేస్తుంట.
ఇప్పటికే చైతూ తో దిగిన ఎనభై ఫోటోల వరకూ సమంత డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కేవలం చైతూ తో మత్రమే దిగిన ఫోటోలను డిలీట్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీ తో దిగిన చైతూ లేని ఫోటోలను మాత్రం అలాగే దాచుకుంటుందట. విడాకుల ప్రకటన తరవాత సామ్ ఎలాగూ సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా తీసుకున్న నిర్ణయంతో విడాలకు తరవాత కొంత కాలం మాత్రం తీర్థయాత్రలు....ట్రిప్ లకు వెళుతూ చైతూను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది.
రీసెంట్ గా సమంత తన స్నేహితులతో కలిసి పలు ఆలయాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మరోసారి తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ ట్రిప్ కు వెళ్లింది. సామ్ తన స్నేహితులతో కలిసి రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి దుబాయ్ విమానం ఎక్కేసింది. ఇక అక్కడ కూడా కొద్ది రోజులు సరదాగా గడిపి మళ్లీ తిరిగి వచ్చి షూటింగ్ లో బిజీ అవ్వాలని సమంత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సమంత కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పడంతో నిర్మాతలు దర్శకులు కొత్త కథలతో వెళుతున్నట్టు తెలుస్తోంది.