తాప్సి బాటలోనే రాశిఖన్నా... ఫ్యాన్స్ షాక్?
ఆ తర్వాత కోలీవుడ్ లోనూ మంచి అవకాశాలను అందుకుంటూ తన హవా చాటింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చేస్తున్న "థ్యాంక్యూ" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ హీరోయిన్ కి సంబందించిన ఓ వార్త అభిమానుల్ని ఎంతగానో బాధపెడుతోంది. రాశిఖన్నా కూడా తాప్సీ బాటలోనే నడవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇకపై బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.
దీని వెనుక కారణం ఏమిటా అని ఆరాతీస్తే అక్కడ ఛాన్స్ లు కూడా ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ముంబై కి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఆమె ఫ్యాన్స్ కి మాత్రం ఇది పెద్ద షాక్ ఇస్తోంది. ఇప్పటికే అక్కడ సెటిల్ అయిన తాప్సి వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఉంది. మరి రాశిఖన్నా ప్లాన్ ఏమిటో అన్నది తెలియాలంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.