పవన్ కళ్యాణ్ ను కలవనున్న రాజమౌళి..?

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించిన విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా, ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను  సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం కంటే ముందే మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు, పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు, ప్రభాస్ రాదే శ్యామ్ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నారు అని ప్రకటించడంతో మహేష్ బాబు తన సర్కార్ వారి పాట సినిమాను జనవరి 13 వ తేదీ నుండి ఏప్రిల్ 1 వ తేదీకి వాయిదా వేసుకున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం తన సినిమాను చెప్పినట్టు గానే జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నాడు. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా కూడా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాక పోతే భీమ్లా నాయక్ సినిమాను కూడా వాయిదా వేయటం లేదని, మొదటగా చెప్పిన తేదీకే సినిమాను విడుదల చేసే  అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ వున్న పవన్ కళ్యాణ్ సినిమా జనవరి 12 వ తేదీన విడుదల కావడం వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున దర్శక ధీరుడు రాజమౌళి, పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిసి భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోమని కొరబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: