జగన్ తో అల్లు అరవింద్ భేటీ...?

Sahithya
సినిమా టికెట్ల ధర లకు సంబంధించి తెలుగు సినిమా లో ఇప్పుడు కాస్త ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సినిమా పరిశ్రమలో ఇబ్బంది పెడుతోందని కొంతమంది కామెంట్లు కూడా చేయడం ఈ మధ్యకాలంలో జరుగుతోంది. తెలుగు సినిమాకు సంబంధించి కొంత మంది అగ్ర హీరోలు కాస్త ఈ మధ్యకాలంలో దూకుడుగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది ప్రముఖులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆసక్తికర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి దీనికి సంబంధించి చర్చించే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అల్లు అరవింద్ గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని భావించగా అప్పుడు చిరంజీవి అలాగే మరికొంత మంది తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో కలిసి చర్చలు జరపడంతో టిక్కెట్ల ధరల కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాలేదు.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దగ్గర చేసుకునేందుకు కొంతమంది నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ సహా కొంతమంది నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉండవచ్చని అల్లు అరవింద్ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావచ్చని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే టికెట్ ధర లకు సంబంధించిన ఫోటో సినిమా పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరే ముఖ్యమంత్రి జగన్ వెనక్కు తగ్గక పోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనేది నిజం.దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: