సద్గురును కలిసిన సమంత.. ఎందుకంటే..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సమంత.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో 2009 నుంచి ఫామ్‌లో ఉన్న ఈ హీరోయిన్ ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇక అప్పటి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని కోడలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో సమంత పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా లేదా అని ఎంతోమంది సందేహం వ్యక్తం చేసిన సమయంలో పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా అని ఆమె వెల్లడించారు.
సమంత పెళ్లి తరువాత నటించిన సినిమాలతో చాలా మందికి అభిమాన నటిగా మారిపోయింది. అంతేకాదు.. అన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ తన నటనతో సత్తా చాటింది. పెళ్లి తరువాత భర్త నాగ చైతన్యతో మజిలీ సినిమాలో నటించిన సమంత ఆ తర్వాత ఓ బేబీ అంటూ వృద్దురాలిగా ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె కరోనా లాక్ డౌన్ సమయంలో టెర్రస్ పై చెట్ల పెంపకం.. భర్తకి ఇష్టమైన వంటకాలు నేర్చుకోవడం వంటి వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
అంతేకాదు.. సమంత  బిగ్ బాస్ షోలో ఒక ఎపిసోడ్‌ని హోస్ట్ చేయడం.. ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న తరువాత వరుస సినిమాలతో బిజీగా రాణిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు విహారయాత్రల్లో ఉండే సమంత సద్గురును కలవడం ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఆమెకి ఆధ్యాత్మిక చింతనతో పాటు దైవికం గురించి సద్గురు చెప్పిన కొన్ని మాటలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: