మహేష్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వం లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో  బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఇలాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట, ఈ సినిమాకు గీత గోవిందం ఫెమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు, అలాగే ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెరిగేలా చేస్తాయి, ఇలా జనాలలో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు కు సర్జరీ జరగడం వల్ల సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొనడం లేదు, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకొని సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా ఆ సినిమాపై అంచనాలు పెంచిన ఈ చిత్ర బృందం తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ కు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: